బీజింగ్ : రెడ్మి 11టీ సిరీస్ ఫోన్లను ఈ నెల 24న తొలుత చైనా మార్కెట్లో లాంఛ్ చేయనుంది. రెడ్మి నోట్ 11టి ప్రొ+, రెడ్మి నోట్ 11టి ప్రొ లాంఛ్ డేట్ను మే 24గా నిర్ధారిస్తూ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. రెడ్మి 11టీ సిరీస్ ఫోన్లు భారత్లో ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయనే వివరాలను రెడ్మి వెల్లడించలేదు.
న్యూ రెడ్మి నోట్ సిరీస్ ఫోన్లు గ్లోబల్ మార్కెట్లో పోకో బ్రాండింగ్పై కస్టమర్ల ముందుకొస్తాయని చెబుతున్నారు. న్యూ రెడ్మి స్మార్ట్ఫోన్లు ఎల్ఈడీ ఫ్లాష్తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తో రానున్నాయి. రెడ్మి 11టి ప్రొ+, రెడ్మి నోట్ 11టి ప్రొ బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్స్లో లభిస్తాయని కంపెనీ రిలీజ్ చేసిన టీజర్లలో వెల్లడైంది.
ఇక ఆండ్రాయిడ్ 12 ఓఎస్పై రన్ అవనున్న ఈ ఫోన్లు మీడియాటెక్ డైమెన్షిటీ చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానున్నాయి. రెడ్మి నోట్ 11టి సిరీస్లో రెండు ఫోన్లు 6.6 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ రిజల్యూషన్తో కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి. మే 24న ఈ ఫోన్లు లాంఛ్ కానుండటంతో లేటెస్ట్ 11టి సిరీస్కు సంబంధించిన పూర్తి వివరాలు ఆ రోజున వెల్లడి కానున్నాయి.