ఇటీవలే చైనాలో జియోమీ రెడ్మీ నోట్ 11 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. రెడ్మీ నోట్ 11 తో పాటు.. రెడ్మీ నోట్ 11 ప్రో, నోట్ 11 ప్రో ప్లస్ పోన్లను చైనా మార్కెట్లోకి జియోమీ విడుదల చేసింది. అక్టోబర్ 28నే ఈ ఫోన్ లాంచ్ అయింది. ప్రీ రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభం అయ్యాయి.
అయితే.. త్వరలోనే జియోమీ ఇండియన్ మార్కెట్లోకి కూడా రెడ్మీ 11 సిరీస్ ఫోన్లను విడుదల చేస్తోంది. కాకపోతే.. రెడ్మీ పేరుతో కాకుండా జియోమీ 11ఐ పేరుతో లాంచ్ చేస్తోంది. ఇండియాలో రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కానప్పటికీ.. రెడ్మీ నోట్ 11 ప్రోను జియోమీ 11ఐ(Xiaomi 11i)గా… రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ను జియోమీ 11ఐ హైపర్చార్జ్(Xiaomi 11i HyperCharge) పేరుతో లాంచ్ చేయనున్నారు.
చైనాలో రిలీజ్ అయిన రెడ్మీ నోట్ 11 5జీ ఫోన్ ప్రారంభ ధర రూ.15,200, రెడ్మీ నోట్ 11 ప్రో ప్రారంభ ధర రూ.18,700, రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ ప్రారంభ ధర రూ.22,200 గా ఉంది. భారత్లో కూడా దాదాపు ఇదే ధరతో రెడ్మీ సిరీస్ ఫోన్లను అందించనున్నారు.
నోట్ 11 ప్రో, ప్రో ప్లస్ ఫీచర్లలో పెద్దగా తేడా లేదు. రెండింట్లో ఒకేవిధమైన ఫీచర్లు ఉన్నప్పటికీ.. రెడ్మీ నోట్ 11 ప్రో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో రానుంది. రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్లో మాత్రం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. రెండు మోడల్స్లో 6.67 ఇంచ్ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెచ్జెడ్ రీఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్షిటీ 920 ఎస్వోసీ, 8 జీబీ వరకు ర్యామ్ కెపాసిటీ, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ, 108 ఎంపీ రేర్ కెమెరా ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Nokia T20 : నోకియా నుంచి అద్భుతమైన ఫీచర్లతో ట్యాబ్.. ధర కూడా తక్కువే
JioPhone Next : అదిరిపోయిన జియోఫోన్ నెక్స్ట్ లుక్.. ఇదిగో వీడియో
Facebook : ఫేస్బుక్ నుంచి సరికొత్త స్మార్ట్వాచ్.. యాపిల్ వాచ్కు దీటుగా
Facebook : ఫేస్బుక్ కొత్త పేరు ‘మెటా’ అర్థం ఏంటో తెలుసా? ఆ పేరునే మార్క్ ఎందుకు పెట్టాడు?
JioPhone Next : దివాళీకి జియోఫోన్ నెక్స్ట్ విడుదల.. కన్ఫమ్ చేసిన గూగుల్ సీఈవో