న్యూఢిల్లీ : షియామి సబ్ బ్రాండ్ రెడ్మి తన నోట్ సిరీస్లో తాజాగా రెడ్మి నోట్ 11 ఎస్ఈని లాంఛ్ చేసింది. ఐఫోన్ ఎస్ఈ మోడల్స్ ఇన్స్పిరేషన్తో ముందుకొచ్చిన లేటెస్ట్ రెడ్మి ఫోన్ ఎస్ఈని పోలిన స్పెసిఫికేషన్స్తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. అందుబాటు ధరలో ఆకర్షణీయ ఫీచర్లతో ఈ స్మార్ట్ఫోన్ కస్టమర్లను మెప్పించనుంది.
డెడికేటెడ్ మైక్రోఎస్డీ స్లాట్తో ఎక్స్పాండ్ చేసుకునే వెసులుబాటుతో రెడ్మి నోట్ 11 ఎస్ఈ కేవలం 64జీబీ స్టోరేజ్తో వస్తోంది. ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో జీ95 చిప్సెట్ను కలిగిఉంది. బారత్లో రెడ్మి నోట్ 11 ఎస్ఈ రూ 13,499కి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ బ్లాక్, వైట్, బ్లూ వంటి మూడు కలర్స్లో లభిస్తోంది.
ఆగస్ట్ 31 నుంచి ఫ్లిప్కార్ట్, షియామి చానెల్స్పై సేల్ షురూ అవుతుంది. ఇక రెడ్మి నోట్ 11 ఎస్ఈ 6.43 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో 64 ఎంపీ ట్రిపుల్ కెమెరా సిస్టమ్తో కస్టమర్ల ముందుకొచ్చింది. 33 డబ్ల్యూ పాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వెసులుబాటును కలిగిఉంది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఏఐ ఫేస్ అన్లాక్, ఐపీ53 రేటింగ్, డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉన్నాయి.