న్యూఢిల్లీ : చైనాలో ఎంట్రీ ఇచ్చిన షియోమి రెడ్మి నోట్ 11 త్వరలో భారత్ మార్కెట్లో లాంఛ్ కానుంది. రెడ్మి నోట్ 10 సిరీస్ తరహాలోనే రెడ్మి నోట్ 11 సిరీస్ కూడా రెడ్మి నోట్ 11, నోట్ 11 ప్రొ, రెడ్మి నోట్ 11 ప్రొ+ వంటి మూడు న్యూ స్మార్ట్ఫోన్లతో కస్టమర్ల ముందుకు రానుంది. ఇక వెనిలా రెడ్మి నోట్ 11 భారత్లో రెడ్మి నోట్ 11టీ పేరుతో ఎంట్రీ ఇస్తుందని చెబుతున్నారు. ఇక ఇతర రెండు మోడళ్లు షియోమి 11ఐ, షియోమి 11ఐ హైపర్చార్జ్ పేరుతో దేశీ మార్కెట్లో సందడి చేయనున్నాయి.
ఇక నోట్ 11, నోట్ 11 ప్రొ+ మోడల్స్ 920 చిప్సెట్ డైమెన్సిటీతో రానున్నాయి. రెడ్మి నోట్ 11 6.6 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడ ప్యానెల్తో డైమెన్సిటీ 810 5జీ చిప్సెట్తో కస్టమర్ల ముందుకు వస్తుంది. నోట్ 11 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్తో పాటు 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమరా కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని ఈ స్మార్ట్ఫోన్ల స్పెసిఫికేషన్స్ను ఓ రిపోర్ట్ లీక్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ 33డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుందని పేర్కొంది. రెడ్మి నోట్ 11 రూ 14,000కు అందుబాటులో ఉంటుందని, 11 ప్రొ రూ 18,700, నోట్ 11 ప్రొ+ రూ 22,000 పలుకుతుందని అంచనా.