ఇటీవలే చైనాలో ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ జియోమీ నుంచి రెడ్మీ నోట్ 11 సిరీస్ లాంచ్ అయింది. ఈ సిరీస్లో భాగంగా రెడ్మీ నోట్ 11 5జీ, రెడ్మీ నోట్ 11 ప్రో, రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి.
ఈ ఫోన్లు భారత మార్కెట్లో పేరు మార్చుకొని లాంచ్ కానున్నాయి. రెడ్మీ నోట్ 11 ప్రో, ప్రో ప్లస్ మోడల్స్ జియోమీ 11ఐ, జియోమీ 11ఐ హైపర్చార్జ్గా లాంచ్ అవుతున్నట్టు ఇప్పటికే జియోమీ ప్రకటించింది. తాజాగా రెడ్మీ నోట్ 11 5జీ ఫోన్ను రెడ్మీ నోట్ 11టీ 5జీగా లాంచ్ చేస్తున్నారు.
అయితే.. రెడ్మీ నోట్ 11 సిరీస్ను భారత్లో ఎప్పుడు రిలీజ్ చేసేది జియోమీ వెల్లడించలేదు. ఈ ఫోన్ 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 90 హెచ్జెడ్ రీఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్షిటీ 810 ఎస్వోసీ, 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ సెకండరీ సెన్సార్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
WhatsApp : వాట్సప్లో త్వరలో రానున్న అద్భుతమైన ఫీచర్
Nokia T20 : నోకియా నుంచి అద్భుతమైన ఫీచర్లతో ట్యాబ్.. ధర కూడా తక్కువే
JioPhone Next : అదిరిపోయిన జియోఫోన్ నెక్స్ట్ లుక్.. ఇదిగో వీడియో
Facebook : ఫేస్బుక్ నుంచి సరికొత్త స్మార్ట్వాచ్.. యాపిల్ వాచ్కు దీటుగా
Facebook : ఫేస్బుక్ కొత్త పేరు ‘మెటా’ అర్థం ఏంటో తెలుసా? ఆ పేరునే మార్క్ ఎందుకు పెట్టాడు?