న్యూఢిల్లీ : రెడ్మి కే50ఐ కొనుగోలు చేసే వారికి రూ 4999 విలువైన ఫ్రీ స్మార్ట్ స్పీకర్ను షియామి ఆఫర్ చేస్తోంది. రెడ్మి కే50ఐతో పాటు కొద్దిరోజుల కిందట ప్రకటించిన ఐఆర్ కంట్రోల్తో కూడిన షియామి స్మార్ట్ స్పీకర్ను ఫ్రీగా కంపెనీ ఆఫర్ చేస్తోంది. అయితే ఎంఐ.కాం పైనే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. భారత్లో రెడ్మి కే50ఐని ఇటీవలే షియామి లాంఛ్ చేసింది.
రూ 25,999 ప్రారంభ ధరతో ఈ స్మార్ట్పోన్ లభిస్తోంది. రూ 30,000 లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్గా రెడ్మి కే50ఐ నిలుస్తోందని టెక్ నిపుణులు చెబుతున్నారు. లేటెస్ట్ రెడ్మి స్మార్ట్ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ఎస్ఓసీని కలిగిఉంది. అమోల్డ్కు ప్రత్యామ్నాయంగా ఈ స్మార్ట్ఫోన్లో ఎల్సీడీ ప్యానెల్ ఉంది.
ఇది హెచ్డీఆర్ 10, డాల్బీ విజన్ను సపోర్ట్ చేయడంతో నెట్ఫ్లిక్స్ వంటి ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫాం నుంచి హై క్వాలిటీ వీడియోలను వీక్షించే వెసులుబాటు ఉంది. ఇక రెడ్మి కే50ఐ ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్తో 6.6 ఇంచ్ స్క్రీన్ను కలిగిఉంది.