న్యూఢిల్లీ : భారత్లో రెడ్మి కే50ఐని జులై 20న లాంఛ్ చేస్తూ రెడ్మి కే సిరీస్ను షియామి తిరిగి దేశీ మార్కెట్లోకి తీసుకురానుంది. రెడ్మి కే50ఐ నథింగ్ ఫోన్ వన్, వన్ప్లస్ నార్డ్ 2టీ 5జీ, ఐక్యూఓఓ నియో 6, పోకో ఎఫ్4 5జీ వంటి ఫోన్లకు దీటైన పోటీ ఇవ్వనుంది. అమెజాన్ ఇండియాలో ఈ స్మార్ట్పోన్ సేల్స్ అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.
రెడ్మి కే50ఐ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ఎస్ఓసీ చిప్సెట్ను కలిగిఉంటుందని తెలిపింది. ఎంఐ.కాంలో కూడా ఈ డివైజ్ లభిస్తుంది. లాంఛ్ తర్వాత ఎంఐ హోం స్టోర్స్లోనూ రెడ్మి కే50ఐ అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ 6జీబీ ర్యాం మోడల్ రూ 24,000 నుంచి రూ 28,000 మధ్య ఉంటుందని అంచనా. రెడ్మి కే50ఐ 5080ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో 67డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ను కలిగిఉంది.
ఇక రెడ్మి కే50ఐ ఫుల్ హెచ్డీ+తో 6.6 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ రెడ్మి ఫోన్ ఆండ్రాయిడ్ 12 అవుటాఫ్ బాక్స్ ఓఎస్పై రన్ అవుతుంది. ఇక ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 16ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు 64ఎంపీ మెయిన్ కెమెరా, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, సెల్పీల కోసం 2ఎంపీ మ్యాక్రో కెమెరాను కలిగిఉంది.