రియల్మీ బ్రాండ్లో హైఎండ్ స్పెసిఫికేషన్స్తో స్మార్ట్ ఫోన్ కావాలంటే.. రియల్మీ జీటీ స్మార్ట్ఫోన్ బెస్ట్ ఆప్షన్. ఇప్పటికే చైనాలో గత మార్చ్లో ఈ ఫోన్ రిలీజ్ అయింది. త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా ఈ ఫోన్ను తీసుకురానున్నట్టు కంపెనీ సీఈవో మాధవ్ సేత్ ప్రకటించారు.
రియల్మీ జీటీ సిరీస్లో రియల్మీ జీటీ నియో, రియల్మీ నియో ఫ్లాష్ ఎడిషన్, రియల్మీ జీడీ మాస్టర్ ఎడిషన్, రియల్మీ జీటీ ఎక్స్ప్లోరర్ మాస్టర్ ఎడిషన్ మోడల్స్ విడుదల కానున్నాయి. భారత మార్కెట్లోకి ఆగస్టు 18న ఈ ఫోన్లు రిలీజ్ కానున్నాయి. ఈ మోడల్స్ ప్రారంభ ధర 30 వేల వరకు ఉండనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
చైనాలో గత మార్చ్లోనే ఈ ఫోన్లను విడుదల చేసినా.. గత జూన్ నెలలోనే ప్రపంచవ్యాప్తంగా ఈ మోడల్స్ను కంపెనీ రిలీజ్ చేసింది. అయితే.. ఇండియాలో మాత్రం అప్పుడు రిలీజ్ చేయలేదు. ఆగస్టు 18 న ఈ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది.
ఇక.. ఫీచర్స్ విషయానికి వస్తే.. గ్లోబల్ మార్కెట్లో కంపెనీ విడుదల చేసిన ఫోన్ల స్పెసిఫికేషన్స్తోనే భారత్లో కూడా విడుదల చేయనున్నారు. బ్లూ, సిల్వర్, రేసింగ్ ఎల్లో కలర్ వేరియంట్స్లో ఈ ఫోన్లను తీసుకురానున్నారు. 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఏఎంవో ఎల్ఈడీ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 888 ఎస్వోసీ పవర్ ప్రాసెసర్, 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్, 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీలాంటి అత్యాధునికమైన ఫీచర్స్తో జీటీ సిరీస్ రిలీజ్ కానుంది.