న్యూయార్క్ : స్నాప్డ్రాగన్ సమ్మిట్ 2022 వేదికగా క్వాల్కాం తన లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ను ఆవిష్కరించింది. నూతన చిప్సెట్ 2023లో ఫ్లాగ్షిప్ ప్రీమియం స్మార్ట్ఫోన్ల ముఖచిత్రాన్ని మార్చివేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ చిప్సెట్ గత ప్రాసెసర్తో పోలిస్తే 4.35X మెరుగైన ఏఐ సామర్ధ్యాలను, 40 శాతం అధిక ఎఫీషియన్సీ, 25 శాతం అధిక జీపీయూ సామర్ధ్యాలను అందుబాటులోకి తీసుకురానుంది.
ఆసుస్ ఆర్ఓజీ, హానర్, ఐక్యూఓఓ, మొటొరోలా, నుబియ, వన్ప్లస్, ఒప్పో, రెడ్మ్యాజిక్, రెడ్మి, షార్ప్, సోనీ, వివో, షియామి, జడ్టీజీ వంటి కంపెనీలు తమ స్మార్ట్ఫోన్లలో న్యూ స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ను వాడనున్నాయమని ఈ సమ్మిట్లో క్వాల్కాం తెలిపింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు ఈ ఏడాది చివరి నాటికి లాంఛ్ అవుతాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
4ఎన్ఎం ప్రాసెస్ టెక్నాలజీతో క్వాల్కాం న్యూ చిప్సెట్ రూపొందనుంది. మెరుగైన ఏఐ, కనెక్టివిటీ ఆప్షన్స్ను జోడిస్తూ ఈ ప్రాసెసర్ను డిజైన్ చేశారు. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా, ఒప్పో ఫైండ్ఎక్స్ ఫోన్ వంటి స్మార్ట్ఫోన్లు ఈ లేటెస్ట్ చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానున్నాయి.