దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో చాలా రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి.
లాక్డౌన్తో అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని సర్వీసులు నిలిచిపోయాయి. వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ఫోన్లు తదితర వస్తువుల వారంటీలు ముగుస్తున్నాయి. విపత్కర సమయంలో స్మార్ట్ఫోన్ బ్రాండ్ పొకో ఇండియా తన వినియోగదారులకు గుడ్న్యూస్ చెప్పింది. స్మార్ట్ఫోన్ల వారంటీ, సర్వీస్ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
మే లేదా జూన్ నెలల్లో వారంటీ ముగుస్తున్న ఫోన్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. పొకో ఫోన్ వారంటీ మే/జూన్ నెలల్లో ముగుస్తున్నట్లైతే వాటి వారంటీ ఆటోమేటిక్గా జూలై/ఆగస్టు వరకు
పొడిగించబడుతుంది. దీనికోసం యూజర్లు ఏమీ చేయనవసరం లేదు. మే నెలలో ఎటువంటి ప్రొడక్టులను లాంచ్ చేయబోమని కంపెనీ ప్రకటించింది.