న్యూఢిల్లీ : ఒప్పో భారత్లో తన తొలి ట్యాబ్లెట్ను లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది. జులై 18న భారత్లో ఒప్పో ప్యాడ్ ఎయిర్ను ఆవిష్కరించేందుకు స్మార్ట్ఫోన్ కంపెనీ సన్నాహాలు చేపట్టింది. ఒప్పో రెనో 8 సిరీస్, ఒప్పో ఎన్కో ఎక్స్2తో పాటు న్యూ ట్యాబ్లెట్ను కంపెనీ లాంఛ్ చేయనుంది.
షియామి ప్యాడ్ 5, మోటో ట్యాబ్ జీ70లకు ఒప్పో ప్యాడ్ ఎయిర్ దీటైన పోటీ ఇవ్వనుంది. ఒప్పో ప్యాడ్ ఎయిర్ ఆక్టా-కోర్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్, 6జీబీ ఎక్ట్సెండెడ్ ర్యామ్తో కస్టమర్ల ముందుకు రానుంది. ఇక ఈ ట్యాబ్లెట్ 10.36 ఇంచ్ 2కే డిస్ప్లే కలిగిన ఒప్పో ప్యాడ్ ఎయిర్ దాదాపు రూ 15,100కు అందుబాటులో ఉండనుంది. భారత్లో ఒప్పో బడ్జెట్ ట్యాబ్లెట్నే లాంఛ్ చేయనుంది. ఇక ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 12 కలర్ఓఎస్ 12పై రన్ అవుతుంది.
ఒప్పో ప్యాడ్ ఎయిర్ సింగిల్ 8ఎంపీ సింగిల్ లెన్స్తో పాటు ముందు భాగంలో 5ఎంపీ సెల్పీ కెమెరాతో రానుంది. డోల్బీ అట్మాస్ సపోర్ట్తో ఒప్పో ప్యాడ్ ఎయిర్ క్వాడ్ స్పీకర్లను కలిగిఉంటాయి. ఈ ట్యాబ్లెట్ 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 7100ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది.