న్యూఢిల్లీ : జులై 18న భారత్లో లాంఛ్ కానున్న ఒప్పో రెనో 8 5జీ, రెనో 8 ప్రొ 5జీ ధరల వివరాలు వెల్లడయ్యాయి. ఒప్పో రెనో 8 ధర భారత్లో రూ 29,999 నుంచి ప్రారంభమవుతుందని టెక్ నిపుణులు సుధాన్షు అంచనా వేశారు. భారత్లో ఒప్పో రెనో 8, రెనో 8 ప్రొ పేరుతో రెండు ప్రీమియం స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేయనుంది. ఇక ఒప్పో రెనో 8 ప్రొ 5జీ రూ 44,990కి అందుబాటులో ఉంటుందని సుధాన్షు పేర్కొన్నారు.
ఈ స్మార్ట్ఫోన్ల అధికారిక ధరలను లాంఛ్ ఈవెంట్ రోజున ఒప్పో ప్రకటించనుంది. ఇక ఈ రెండు ఫోన్లు 80డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో 4500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్లను ఆకట్టుకుంటాయని కంపెనీ తెలిపింది. రెనో 8 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ఎస్ఓసీ చిప్సెట్తో రానుండగా రెనో 8 ప్రొ 5జీ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ఎస్ఓసీ చిప్సెట్ను కలిగిఉంది.
రెనో 8 ప్రొ 5జీ వెనుకభాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్తో, 50ఎంపీ మెయిన్ కెమెరా, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపీ మ్యాక్రో కెమెరాలను కలిగిఉంటుంది. ఇక రెనో 8 5జీ 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్766 మెయిన్ కెమెరా, 2ఎంపీ మ్యాక్రో కెమెరాతో రానుంది. రెండు ఫోన్లు 32ఎంపీ ఫ్రంట్ కెమరాతో కస్టమర్ల ముందుకు రానున్నాయి. రెనో 8 5జీ 6.43 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో, రెనో 8 ప్రొ 5జీ 6.7 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి.