చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో.. ప్రముఖ టెలికాం సంస్థ రిలయెన్స్ జియోతో చేతులు కలిపింది. జియోతో పార్టనర్షిప్ తర్వాత.. జియో కస్టమర్లకు ఒప్పోలోని పలు స్మార్ట్ఫోన్లను డిస్కౌంట్ ధరతో అందిస్తోంది.
తాజాగా ఒప్పో ఏ15 స్మార్ట్ఫోన్ను రూ.9,991కే అందిస్తోంది. నిజానికి.. ఒప్పో ఏ15 స్మార్ట్ఫోన్ ధర రూ.10,990. జియోతో టైఅప్ అయ్యాక.. రూ.999 తగ్గించి.. ఏ15 స్మార్ట్ఫోన్ను రూ.9,991 కే అందిస్తోంది.
ఒప్పో ఏ15 3జీబీ స్మార్ట్ఫోన్ను జియో యూజర్ల కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు. ఈ ఫోన్తో ఇతర బెనిఫిట్స్ను కూడా పొందొచ్చు. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐతో పాటు రూ.7000 విలువైన ఇతర బెనిఫిట్స్ను పొందొచ్చని ఒప్పో వెల్లడించింది.
ఏ15.. 3జీబీ మోడల్తో వచ్చే ఈ ఫోన్లో ఏఐ ట్రిపుల్ కెమెరా సెటప్, 16.55 సెంమీ హెచ్డీ ప్లస్ స్క్రీన్, 3డీ కర్వ్ డిజైన్, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆక్టా కోర్ మీడియాటెక్ హెలియో పీ35 ప్రాసెసర్ లాంటి ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది.
ఈ ఆఫర్.. ఇప్పటికే జియో కస్టమర్లుగా ఉన్నవాళ్లకు, కొత్త జియో కస్టమర్లకు కూడా వర్తిస్తుంది. అయితే.. ఈ ఫోన్లో వాయిస్, డేటా సర్వీస్లను ఉపయోగించాలంటే మాత్రం ఖచ్చితంగా జియో సిమ్కార్డును ఉపయోగించాల్సి ఉంటుంది.