న్యూఢిల్లీ : భారత్లో ఒప్పో ఫైండ్ ఎక్స్7 అల్ట్రా స్మార్ట్ఫోన్ను (Oppo Find X7 Ultra) ఒప్పో లాంఛ్ చేసింది. ఫైండ్ ఎక్స్7 అల్ట్రా సిరీస్ బ్రాండ్ నుంచి మరో కెమెరా ఫోకస్డ్ స్మార్ట్ఫోన్గా కస్టమర్ల ముందుకొచ్చింది. రెండు పెరిస్కోప్ కెమెరాలతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తొలి ఫోన్ ఇదే కావడం ఈ డివైజ్ ప్రత్యేకతగా చెబుతున్నారు. ఒప్పో ఫైండ్ ఎక్స్7తో పాటు ఫైండ్ ఎక్స్7 అల్ట్రాను కూడా ఒప్పో ప్రవేశపెట్టింది.
ఈ స్మార్ట్ఫోన్ హాసెల్బ్లాడ్ బ్రాండెడ్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్తో వెనుకభాగంలో నాలుగు 50ఎంపీ కెమెరాలతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఫైండ్ ఎక్స్7 అల్ట్రా సోనీ లేటెస్ట్ 1 ఇంచ్ టైప్ ఎల్వైటీ-900 సెన్సర్ను కలిగిఉంది. ఇక ఒప్పో ఫైండ్ ఎక్స్7 మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్పై రన్ అవుతుంది.
సెల్ఫీల కోసం 32ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు రెండు ఫోన్లు భారీ 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో 100డబ్ల్యూ సూపర్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. పైన్ షాడో, సిల్వర్ మూన్, వ్యాస్ట్ సీ, స్కై వంటి విభిన్న కలర్స్లో లభించే ఈ ఫోన్లు రూ. 70,000 నుంచి అందుబాటులో ఉంటాయి.
Read More :