న్యూఢిల్లీ : వచ్చే ఏడాది మార్చిలో ఒప్పో ఎఫ్21 భారత్ మార్కెట్లో లాంఛ్ కానుంది. ఒప్పో ఎఫ్21 సిరీస్ స్మార్ట్ఫోన్లు ఆండ్రాయిడ్ 12-ఆధారిత కలర్ఓఎస్పై రన్ అవుతాయని భావిస్తున్నారు. దీపావళికి ముందే ఒప్పో ఎఫ్21 సిరీస్ భారత్లో ఎంట్రీ ఇస్తుందని భావించినా గ్లోబల్ సెమికండక్టర్ కొరత కారణంగా ఈ స్మార్ట్ఫోన్ సిరీస్ లాంఛ్లో జాప్యం నెలకొంది.
వచ్చే ఏడాది మార్చిలో నూతన డిజైన్తో రూ 20,000 నుంచి రూ 30,000 ధరతో ఒప్పో ఎఫ్21 సిరీస్ భారత్లో కస్టమర్ల ముందుకు రావచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఎఫ్21 సిరీస్ స్లీక్, స్టైలిష్ డిజైనతో పాటు కలర్ఫుల్ డిజైన్తో కస్టమర్లను ఆకట్టుకుంటుందని 91మొబైల్స్ వెల్లడించింది.
ఎఫ్19కి కొనసాగింపుగా వస్తున్న ఒప్పో ఎఫ్21 సిరీస్ కెమెరా, పెర్ఫామెన్స్ యూనిట్లో అప్గ్రేడ్స్ ఉంటాయని భావిస్తున్నారు. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సర్తో పాటు ఎఫ్19 సిరీస్ కంటే పెద్ద బ్యాటరీలను ఈ స్మార్ట్ఫోన్ కలిగిఉంటుందని లీకైన స్సెసిఫికేషన్లు వెల్లడిస్తున్నాయి.