భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండటంతో దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించాయి. దీంతో చాలా మంది ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. కొవిడ్ వల్ల ప్రజలకు అవసరమైన చాలా సేవలను ఆయా కంపెనీలు, సంస్థలు ఆన్లైన్లోనే అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో తమ కంపెనీ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు డోర్డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం వాట్సాప్లో సేవలను ఆరంభించింది.
స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో తన ఉత్పత్తులను వాట్సాప్ యాప్లో సాధారణ టెక్ట్స్తో హోమ్ డెలివరీ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. మే 24 నుంచి వినియోగదారులు ఎలాంటి ఒప్పో ప్రొడక్టునైనా వాట్సాప్ టెక్ట్స్తో ఆర్డర్ చేయొచ్చు. మొదటగా మీ వాట్సాప్ నుంచి +91-9871502777 నంబర్కు రాష్ట్రం పేరు, మీరు ఉంటున్న ఏరియా పిన్కోడ్ను పంపాల్సి ఉంటుంది. దీంతో వెంటనే సమీపంలోని రిటైల్ స్టోర్ నుంచి మీకు కాల్ వస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. లాక్డౌన్ నేపథ్యంలో వారంటీ గడువును ఒప్పో జూన్ 30 వరకు పొడిగించింది.