న్యూఢిల్లీ : ఒప్పో నూతనంగా లాంఛ్ చేసిన ఒప్పో ఏ17 బడ్జెట్ వెర్షన్గా భారత్లో తాజాగా ఒప్పో ఏ17కేను లాంఛ్ చేసింది. డిజైన్ పరంగా రెండు ఫోన్లు ఒకే రకంగా కనిపించినా అందుబాటు ధర కావడంతో ఒప్పో ఏ17కే ఫీచర్లలో రాజీపడింది. ఈ స్మార్ట్ఫోన్ కేవలం ఒక రియర్ కెమెరా సెన్సర్తోనే కస్టమర్ల ముందుకొచ్చింది.
ఒప్పో ఏ17కే రూ 10,499కి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ సింగిల్ 3జీబీ ర్యాం, 64జీబీ స్టోరేజ్ వేరియంట్లోనే లభిస్తుంది. బ్లాక్, గోల్డ్ కలర్ ఆప్షన్స్లో ఒప్పో ఏ17కే లభిస్తోంది. ఒప్పో ఏ17కే మీడియాటెక్ హెలియో జీ35 ఎస్ఓసీ చిప్సెట్ను కలిగిఉంది. ఈ స్మార్ట్ఫోన్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం, డ్యూయల్ సిమ్ స్లాట్, చార్జింగ్ కోసం మైక్రో యూఎస్బీ పోర్ట్ వంటి ఫీచర్లతో కస్టమర్ల ముందుకొచ్చింది.