న్యూయార్క్ : గాజా యుద్ధం నేపధ్యంలో ఇటీవల తమకు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడేందుకు టెక్ ప్రపంచంలోని ముస్లిం, అరబ్ వర్గాలు అసౌకర్యంగా భావిస్తున్నాయని ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ (Sam Altman) పేర్కొన్నారు. గాజా వార్పై తాము నోరు విప్పితే అది ప్రతీకారానికి దారి తీస్తుందనే ఆందోళన వారిలో నెలకొందని అన్నారు.
తాను మాట్లాడిన టెక్ కమ్యూనిటీలోని ముస్లిం అరబ్ (ముఖ్యంగా పాలస్తీనియన్) సహోద్యోగులు వారి ఇటీవలి అనుభవాల గురించి మాట్లాడటానికి అసౌకర్యంగా ఉన్నారని, వారిలో ప్రతీకార భయం, కెరీర్ అవకాశాలు దెబ్బతింటాయనే ఆందోళన నెలకొందని ట్విట్టర్ వేదికగా ఆల్ట్మాన్ రాసుకొచ్చారు. ఈ వర్గాలకు చెందిన టెకీల పట్ల సానుభూతితో వ్యవహరించాలని టెక్నాలజీ పరిశ్రమను కోరారు.
గత ఏడాది అక్టోబర్ 7న పాలస్తీనా ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసినప్పటి నుంచి అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇస్లామోఫోబియా పెరిగిందని మానవ హక్కుల కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఇజ్రాయెల్పై హమాస్ దాడిలో 1200 మంది మరణించారు. ఇక గాజాపై ఇజ్రాయెల్ ప్రతిదాడుల్లో 22,000 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Read More :