న్యూఢిల్లీ : భారత్లో వన్ప్లస్ (OnePlus) 108 ఎంపీ కెమెరాతో తొలి స్మార్ట్ఫోన్ను ఏప్రిల్ 3న లాంఛ్ చేయనుంది. వన్ప్లస్ నార్డ్ బడ్స్ 2తో పాటు ఏప్రిల్ 3న వన్ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ను కంపెనీ లాంఛ్ చేయనుంది. అప్కమింగ్ ఫోన్లో 108 ఎంపీ కెమెరాను జోడించనున్నట్టు లాంఛ్కు ముందు వన్ప్లస్ నిర్ధారించింది.
దీంతో 108 ఎంపీ కెమెరాను కలిగిఉన్న తొలి వన్ప్లస్ ఫోన్గా వన్ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ నిలవనుంది. రెడ్మి నోట్ 11 ప్రో వంటి మిడ్ బడ్జెట్ ఫోన్ల తరహాలో వన్ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ఫోన్లో ఐసోసెల్ హెచ్ఎం 2 సెన్సర్ కూడా ఉంటుందని బావిస్తున్నారు. న్యూ కెమెరా 3x లాస్లెస్ జూమ్ ఆఫర్ చేస్తుందని వన్ప్లస్ చెబుతోంది.
ఈ ప్రైమరీ కెమెరా క్లోజప్ షాట్స్ను సైతం స్పష్టంగా, కలర్ఫుల్గా, విస్తృత డిటైయిల్తో క్యాప్చర్ చేస్తుంది. నార్డ్ సీఈ3 లైట్ 5జీ 67డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్ల ముందుకు వస్తుందని వన్ప్లస్ వెల్లడించింది. ఇక వన్ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ 6.7 ఇంచ్ డిస్ప్లేతో లైమ్, క్రోమాటిక్ గ్రే కలర్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. నార్డ్ సీఈ 3 లైట్ 5జీ 8జీబీ ర్యాం, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 27,999కి లభిస్తుందని అంచనా.
Read More