న్యూఢిల్లీ : ఫ్లాగ్షిప్ వన్ప్లస్ 11ను లాంఛ్ చేసిన అనంతరం వన్ప్లస్ భారత్ మార్కెట్లో వన్ప్లస్ నార్డ్ 3ను జూన్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. కంపెనీ ప్రస్తుతం భారత్లో వన్ప్లస్ నార్డ్ 3 టెస్టింగ్ను చేపట్టింది. నార్డ్ 3 ఈ ఏడాది జూన్లో భారత్లో లాంఛ్ అవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
వన్ప్లస్ గత ఏడాది జులైలో భారత్లో వన్ప్లస్ నార్డ్ 2టీని లాంఛ్ చేసింది. ఇక మైస్మార్ట్ప్లస్ రిపోర్ట్ ప్రకారం వన్ప్లస్ నార్డ్ 3 భారత్లో టెస్టింగ్లో ఉందని, ఈ స్మార్ట్ఫోన్ను ల్యారీ అనే కోడ్ నేమ్తో వ్యవహరిస్తున్నారని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. వన్ప్లస్ తన నార్డ్ డివైజ్ల ధరలు రూ . 30,000లోపు ఉంచగా వన్ప్లస్ నార్డ్ 3 కూడా ఇంచుమించు ఇదే ధరలో ఉంటుందని చెబుతున్నారు.
వన్ప్లస్ నార్డ్ 3 ఫీచర్ల విషయానికి వస్తే ఈ స్మార్ట్ఫోన్ ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్తో 6.7 ఇంచ్ డిస్ప్లేతో కస్టమర్ల ముందుకు రానుంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో వన్ప్లస్ నార్డ్ 3 4500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది. వన్ప్లస్ నార్డ్ 3 ట్రిపుల్ కెమెరా సెటప్తో 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్766 సెన్సర్, 8 ఎంపీ సెకండరీ కెమెరా, 2 ఎంపీ సెన్సర్తో పాటు ముందుభాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఇక వన్ప్లస్ నార్డ్ 3 న్యూ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్సెట్ను కలిగిఉంటుంది.