న్యూఢిల్లీ : వన్ప్లస్ (oneplus) ఇటీవల లాంఛ్ చేసిన ఏస్ 2 డివైజ్కు డైమెన్సిటీ ఎడిషన్గా వన్ప్లస్ ఏస్ 2 డైమెన్సిటీ ఎడిషన్ను లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది. చైనీస్ టెక్ నిపుణులు డిజిటల్ చాట్ స్టేషన్ అంచనా ప్రకారం భారత్లో వన్ప్లస్ 11ఆర్ పేరుతో ఇటీవల లాంఛ్ అయిన ఏస్ 2 డివైజ్కు డైమెన్సిటీ ఎడిషన్ను కంపెనీ ప్రవేశపెట్టనుంది.
వన్ప్లస్ ఏస్ 2 డైమెన్సిటీ ఎడిషన్ తొలుత చైనా మార్కెట్లో ఎంట్రీ ఇచ్చి ఆపై గ్లోబల్ మార్కెట్లలో లాంఛ్ అవుతుంది. ఇదే డివైజ్ను భారత్లో ఎప్పుడు ప్రవేశపెడతారనే వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. న్యూ వెర్షన్ డివైజ్లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ఎస్ఓసీ చిప్సెట్ను వాడతారు. ఈ హ్యాండ్సెట్ బేస్ 12జీబీ + 256 జీబీ బేస్ వేరియంట్ ఒరిజినల్ ఏస్ 2 5జీ ఫోన్ ధర (రూ. 34,100) కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది.
వన్ప్లస్ ఏస్ 2 డైమెన్సిటీ ఎడిషన్ ఒరిజినల్ మోడల్ స్పెసిఫికేషన్స్ తరహాలోనే ఉంటాయి. కెమెరా, చిప్సెట్లో మాత్రమే కొద్దిపాటి వ్యత్యాసాలు ఉంటాయి. లేటెస్ట్ డివైజ్ 6.7 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో పాటు 100డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది. ట్రిపుల్ కెమెరా సెటప్లో భాగంగా 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్890 ఓఐఎస్ మెయిన్ కెమరా, ముందు భాగంలో 16 ఎంపీ కెమెరాతో కస్టమర్ల ముందుకు రానుంది.