న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ మార్కెట్లో ట్రెండ్ సెట్టర్గా భావిస్తున్న నథింగ్ పోన్ వన్ బుకింగ్స్ భారత్లో మరోసారి ఓపెన్ అయ్యాయి. పలువురు ఔత్సాహిక కస్టమర్లు నదింగ్ పోన్ను ప్రీబుకింగ్ చేసుకోవడం మిస్సవడంతో వారందరి కోసం రెండవ దశలో ప్రీ ఆర్డర్ సేల్స్ను సోమవారం నుంచి ప్రారంభించామని నథింగ్ ఇండియా ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ మను శర్మ వెల్లడించారు.
జులై 18న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆసక్తి కలిగిన కస్టమర్లు నథింగ్ పోన్ వన్ను బుక్ చేసుకోవ్చని ప్రకటించారు. నథింగ్ ఫోన్ వన్కు విపరీతమైన డిమాండ్ ఉండటంతో నిమిషాల వ్యవధిలోనే స్టాక్ అయిపోయే అవకాశం ఉందని ఆసక్తి కలిగిన కస్టమర్లు త్వరగా బుక్ చేసుకుంటే మేలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ప్రీ ఆర్డర్ సేల్ను జులై 20 అర్ధరాత్రి వరకూ పొడిగించినట్టు కంపెనీ తెలిపింది, జులై 21 రాత్రి ఏడు గంటల నుంచి నథింగ్ పోన్ వన్ సేల్స్ అందుబాటులో ఉంటాయి.
లేటెస్ట్ ట్రెండీ స్మార్ట్ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లోనే లభిస్తుంది. ఆఫ్లైన్లో నథింగ్ ఫోన్ లభ్యత గురించి కంపెనీ ఇంతవరకూ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇక రెండు వేరియంట్లలో లభించే నథింగ్ పోన్ వన్ బేస్ మోడల్ (8జీబీ ర్యాం, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్) రూ 32,999కి, 8జీబీ ర్యాం, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ 35,999కి లభిస్తుంది. టాప్ ఎండ్ మోడల్ (12జీబీ ర్యాం, 256జీబీ మెమురి) రూ 38,999కి అందుబాటులో ఉంటుంది.