న్యూఢిల్లీ : న్యూ టెక్నాలజీగా ముందుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్పై ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్జీపీటీ(ChatGPT)కి విశేష ఆదరణ లభిస్తోంది. చాట్జీపీటీ పేరుతో నకిలీ యాప్స్ యూజర్లను బోల్తా కొట్టిస్తుండగా తాజాగా లక్ష మందికి పైగా చాట్జీపీటీ యూజర్ల డేటా భద్రత ప్రమాదంలో పడింది. వీరంతా సైబర్ దాడుల ముప్పును ఎదుర్కొంటున్నారని లేటెస్ట్ రీసెర్చి బాంబు పేల్చింది. సింగపూర్కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ గ్రూప్-ఐబి ప్రకారం సేవ్ చేసిన చాట్జిపిటి వివరాలతో హ్యాకర్లు 1,01,134 డివైజ్ల్లో డేటా ఉల్లంఘనలకు పాల్పడ్డారు.
హ్యాకర్లకు చిక్కిన చాట్జీపీటీ ఖాతాలు బ్యాంక్ సమాచారాన్ని వెల్లడించకున్నా యూజర్లకు సంబంధించిన ఈ మెయిల్, పాస్వర్డ్లు, ఫోన్ నెంబర్ల వంటి కీలక డేటా ఇప్పటికీ ఫిషింగ్ అటాక్ వంటి రిస్క్ను ఎదుర్కొంటున్నాయని రిపోర్ట్ పేర్కొంది. గత ఏడాదిగా చాట్జీపీటీ యూజర్ల వ్యక్తిగత వివరాలను హ్యాకర్లు డార్క్ వెబ్ మార్కెట్ప్లేస్ల్లో అమ్మకానికి పెట్టారని సైబర్ సెక్యరిటీ సంస్ధ స్పష్టం చేసింది. భద్రతా పరంగా లోటుపాట్లు ఎదుర్కొంటున్న చాట్జీపీటీ ఖాతాల్లో బారత్ ముందు వరసలో ఉందని ఈ పరిశోధన వెల్లడించింది. యూజర్ల వివరాలను చోరీ చేసేందుకు హ్యాకర్లు ఇన్ఫో స్టీలింగ్ మాల్వేర్ను ఉపయోగించారని గ్రూప్-ఐబీ రీసెర్చి బ్లాగ్ పోస్ట్లో పేర్కొంది.
వైరస్కు లోనైన డివైజ్ల నుంచి బ్రౌజర్లలో సేవ్ చేసిన వివరాలు, బ్యాంక్కార్డు వివరాలు, క్రిప్టో వాలెట్ సమాచారం, కుకీస్, బ్రౌజింగ్ హిస్టరీ వంటి డేటాను ఇన్ఫో స్టీలింగ్ మాల్వేర్ సేకరిస్తుందని గ్రూప్-ఐబీ రీసెర్చ్ వెల్లడించింది. యూజర్ ఫిషీ లింక్స్ను పొరపాటున క్లిక్ చేయడం లేదా మాల్వేర్కు గురైన సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసే సమయంలో మాల్వేర్ డౌన్లోడ్ అవుతుంటుంది. ఇక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని యూజర్లు అధికంగా సైబర్ దాడులకు గురవుతున్నారని ఈ రిపోర్ట్ వెల్లడించింది. భారత్లో 12,632 చాట్జీపీటీ ఖాతాలు డేటా బ్రీచ్కు గురయ్యాయని తెలిపింది. పాకిస్తాన్లో 9217 మంది యూజర్లకు ఈ రిస్క్ ఎదురవగా..బ్రెజిల్, వియత్నాం, ఈజిప్ట్లోని చాట్జీపీటీ యూజర్ల డేటా భద్రత ఉల్లంఘనలకు గురైందని నివేదిక స్పష్టం చేసింది.
Read More :
Whatsapp | వాట్సాప్లో స్పామ్ కాల్స్ వస్తున్నాయా? వాటిని ఇలా ఆఫ్ చేసుకోండి