హైదరాబాద్ : నూతన సంవత్సరంలో చాలామంది కొత్త నిర్ణయాలు తీసుకుంటుంటారు. అటువంటప్పుడు ఏ వాహనం కొనాలి..? ఏది కొంటే బెటర్ అనే ఆలోచన వస్తుంది. అలాంటప్పుడు కొత్తగా మార్కెట్ లోకి ఏమేమి వెహికల్స్ వస్తున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొనుగోలుదారులకు ఏ బైక్ ఎంచుకోవాలనే దానిపై కొంచెం గందరగోళం ఉంటుంది. అందుకోసమే 2022లో విపణిలోకి వచ్చే వాహనాలను గురించి తెలుసుకుందాం..
1980,1990 ల్లో మార్కెట్ ను షేక్ చేసిన యెజ్డీ మోటర్ సైకిల్స్ మళ్లీ వస్తున్నాయి. యెజ్డీలో లేటెస్ట్ మోడల్స్ను జనవరిలో లాంచ్ చేస్తామని మహీంద్రా గ్రూప్కు చెందిన కంపెనీ ప్రకటించింది. మొత్తం మూడు మోడల్స్ను కంపెనీ లాంచ్ చేయనుంది. అడ్వెంచర్, స్క్రాంబ్లర్, రోడ్స్టెర్ సెగ్మెంట్లో వీటిని తీసుకురానుంది. యెజ్డీ మోటార్సైకిల్స్ రోడ్కింగ్ స్క్రాంబ్లర్ రూ.1.60 లక్షలు. హీరో ఎలక్ట్రిక్ AE-8 రూ.70,000లతో మార్కెట్ లోకి రానున్నది.
యమహాYZF R1 Rs20.39 లక్షలు,కవాసకి W175 Rs1.75 లక్షలతో వచ్చే నెలలో విపణిలోకి ప్రవేశించనున్నది. బజాజ్ NS250 Rs1.60 లక్షలు, బెనెల్లి లియాన్సీనో 250 Rs2.50 లక్షలు,హోండా CB300R BS6 Rs2.50 లక్షలు, రాయల్ ఎన్ఫీల్డ్ షాట్గన్ రూ.3 లక్షలకు జనవరి నెలలో లాంఛ్ కానున్నాయి.