ఫోన్ పోతే జీపీఎస్ సాయంతో కనిపెట్టగలం కానీ, పర్సుపోతే మాత్రం అంతే సంగతులు. డబ్బుతోపాటు ఐడీ, పాన్, ఆధార్, క్రెడిట్, డెబిట్ కార్డు.. అన్నీ పోతాయి. ఇలాంటి ఇబ్బంది లేకుండా.. విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లేందుకు ఓ స్మార్ట్ సేఫ్టీ పౌచ్ను తీసుకొచ్చింది ‘ట్రోవా’ సంస్థ. ‘ట్రోవా గోప్లస్’ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ స్మార్ట్ సేఫ్లో వాచీ, బంగారం, డబ్బు, పెన్డ్రైవ్.. ఇలా విలువైన వస్తువుల్ని వెంట తీసుకెళ్లవచ్చు. మనం చేయాల్సిందల్లా ఒకటే. దీన్ని ఫోన్కు కనెక్ట్ చేసుకుని.. సంబంధిత యాప్ను ఇన్స్టాల్ చేసుకోవడమే. స్మార్ట్ లాక్ సిస్టమ్ ఉండటంతో, ఎవరైనా దొంగిలించినా ఓపెన్ చెయ్యలేరు. ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా జీపీఎస్ సాయంతో చిటికెలో ట్రాక్ చేయవచ్చు. ఈ బుల్లి సేఫ్ ఆన్లైన్ ధర రూ.20,600. మీకు నచ్చితే కనుక trovaofficial.comలో ఆర్డరు చేయండి.
ప్లాస్టిక్తో పర్యావరణానికి అంతులేని నష్టం వాటిల్లుతున్నది. బాల్యం నుంచే పిల్లలకు ప్లాస్టిక్ సంక్షోభంపై అవగాహన కలిగించడం మంచిది. అంతేకాదు, ప్లాస్టిక్ వస్తువుల్లో నిల్వచేసే ఆహారం కూడా ఆరోగ్య సమస్యలకు మూలంగా మారుతున్నది. దీంతో, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు ఎకో ఫ్రెండ్లీ వస్తువులను పరిచయం చేస్తున్నాయి పలు సంస్థలు. అందులో భాగంగా పిల్లలకు నచ్చేలా రకరకాల వెదురు వస్తువులను తీసుకొచ్చింది ‘ఆల్థింగ్స్ బేబీ’ సంస్థ. బ్రిటిష్ బ్రాండ్ ‘ఎకో రాస్కల్స్’ రూపొందించే ఈ వస్తువులు రకరకాల కార్టూన్లు, జంతువుల ఆకారాల్లో ఆకట్టుకునేలా ఉంటాయి. వెదురు ప్లేట్లు, గ్లాసులు, స్ట్రాలు, ఫోర్కులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ఆన్లైన్ ధర రూ.499. మీ పిల్లలకూ నాన్-ప్లాస్టిక్ జీవనశైలిని పరిచయం చేయాలనుకుంటే.. allthingsbaby.com చూడవచ్చు.
స్మార్ట్ యుగంలో ఉన్నాం మనం. అన్నిటిలోనూ సాంకేతికతను జోడిస్తున్నారు తయారీ దారులు. తాజాగా, ఇంటీరియర్ డిజైనింగ్ కోసం రెండు స్మార్ట్ ఎల్యీడీ బల్బులను తీసుకొచ్చింది ‘ఫిలిప్స్’. వీటిని ఎక్కడినుంచైనా యాప్ ద్వారా నియంత్రించవచ్చు. వైఫై కనెక్టివిటీ, గూగుల్ అసిస్ట్, అలెక్సా కమాండ్తోనూ కంట్రోల్ చేయవచ్చు. ‘హీరో’ వెర్షన్కు టాప్ సెన్సర్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. వాయిస్ కమాండ్తో పనిచేసే ఈ బల్బు మనం ఎంచుకున్న రంగులో కాంతుల్ని వెదజల్లుతుంది. వీటి ఆన్లైన్ ప్రారంభ ధర.. రూ.8,999(హీరో), రూ.8,599(స్కేర్). పూర్తి వివరాలకు philips.com సందర్శించండి.
సంపూర్ణ ఆరోగ్యానికి స్వచ్ఛమైన గాలి ఇంధనం లాంటిది. రోజురోజుకూ పెరిగి పోతున్న వాయు కాలుష్యంతో గుండెల నిండా ప్రాణవాయువును పీల్చుకోవడమూ కష్టమైపోతున్నది. అలాంటి ఇబ్బంది లేకుండా స్వచ్ఛంగా వడపోసిన గాలిని అందించేందుకు వచ్చేసింది.. ‘రెస్పిరేటరీ వేరియబుల్ ఎయిర్ ప్యూరిఫయర్’. ఒక్కసారి చార్జ్ చేస్తే ఎనిమిది గంటలపాటు పని చేస్తుంది. నిమిషానికి 55 లీటర్ల చొప్పున వడబోసి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. ఎక్కడికెళ్లినా తీసుకెళ్లొచ్చు. మెడలో వేసుకుంటే చాలు. అంతేకాదు, దీనికి అనుబంధంగా ఉన్న ఫేస్షీల్డ్ దగ్గు, జలుబు వంటి అంటువ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది. ఆన్లైన్ ధర రూ.26,000. వివరాలకు respiray.com చూడవచ్చు.