రోజురోజుకూ స్మార్ట్ఫోన్ యూజర్ల సంఖ్య పెరుగుతోంది. అలాగే.. యూజర్ల అంచనాలు కూడా పెరుగుతున్నాయి. స్మార్ట్ఫోన్ ద్వారానే అన్ని పనులు అయిపోవాలని యూజర్లు భావిస్తున్నారు. అరచేతిలో ఇప్పటికే స్మార్ట్ఫోన్ ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నారు. ఇంకా అడ్వాన్స్డ్ పీచర్స్ రావాలని ఆశిస్తున్నారు. అందుకే.. స్మార్ట్ఫోన్ బ్రాండ్స్ కూడా సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వస్తున్నాయి.
స్మార్ట్ఫోన్ల సేల్స్లో టాప్లో ఉన్న పలు బ్రాండ్లను వెనక్కినెట్టి.. తమ ఫోన్ల సేల్స్ పెంచుకోవడం కోసం.. మోటరోలా చాలా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే.. రెగ్యులర్ ఎడ్జ్ 20 స్మార్ట్ఫోన్ను గత నెలలో లాంచ్ చేసింది. ఎడ్జ్ 20 లో భాగంగా లైట్, ప్రో మోడల్స్ను విడుదల చేసింది. అప్పుడు ఈ మోడల్స్ను ఇండియాలో రిలీజ్ చేయలేదు.
తాజాగా.. మోటరోలా ఎడ్జ్ 20 సిరీస్లో ఎడ్జ్ 20 ఫ్యుజన్ను భారత్లో ఆగస్టు 17న రిలీజ్ చేయనుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన లైట్ మోడల్నే భారత్లో ఎడ్జ్ 20 ఫ్యుజన్ పేరుతో విడుదల చేయనుంది.
స్టైలిష్ లుక్తో ఈ ఫోన్ను మోటరోలా తయారు చేసింది. 6.7 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో పాటు 144హెచ్జెడ్ రీఫ్రెష్ రేట్తో మోటరోలా ఎడ్జ్ 20 సిరీస్ ఫోన్లు రానున్నాయి.
ఆక్టా కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778 5జీ ఎస్వోసీ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 5జీ సపోర్ట్ , 4జీ ఎల్టీఈ, వైఫై6, బ్లూటూత్ వీ5.2, 108 ఎంపీ రేర్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్స్ టర్బో పవర్ చార్జింగ్ లాంటి అత్యాధునిక ఫీచర్లతో విడుదల కానున్న ఈ ఫోన్ ధర మాత్రం సుమారు 44,100 రూపాయలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ కేవలం రెండు కలర్స్ వేరియంట్లలో మాత్రం లభించనుంది.