న్యూఢిల్లీ : మోటోరోలా ఈ సిరీస్లో తాజా స్మార్ట్ ఫోన్ మోటోరోలా ఈ30 గ్లోబల్ మార్కెట్లో లాంఛ్ అయింది. గత నెలలో భారత్, యూరప్లో లాంఛ్ అయిన మోటొరోలో ఈ40ని పోలిన విధంగా మోటో ఈ30ని డిజైన్ చేసినట్టు భావిస్తున్నారు. మోటో ఈ30 ట్రిపుల్ రియర్ కెమెరా, కెపాసిటివ్ ఫింగర్ప్రింట్ స్కానర్తో కూడిన టెక్ట్చర్డ్ రియర్ పానెల్తో ముందుకొచ్చింది.
ఈ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ల హెచ్డీప్లస్ ప్యానెల్, ఆక్టా కోర్ యూనిసోక్ టీ700 చిప్సెట్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. భారత్ మార్కెట్లోకి ఇంకా అడుగుపెగట్టని ఈ స్మార్ట్ఫోన్ ధర రూ 10,200 ఉంటుందని అంచనా.