న్యూఢిల్లీ : మొటొరోలా ఎట్టకేలకు మోటో జీ51 స్మార్ట్పోన్ను చైనా మార్కెట్లో లాంఛ్ చేసింది. బ్లూ, గ్రే కలర్స్లో అందుబాటులో ఉండే మోటో జీ51 ధర దాదాపు రూ 17,500 ఉంటుందని చైనీస్ బ్లాగర్ వైల్యాబ్ వెల్లడించింది. ఈ స్మార్ట్పోన్ భారత్ సహా ఇతర మార్కెట్లలో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందనే వివరాలను మొటొరొలో వెల్లడించలేదు.
ఇక మోటో జీ51 6.8 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లేతో పాటు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్తో అందుబాటులో ఉంది. ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు ముందు భాగంలో సెల్ఫీ కెమెరా అమర్చారు.