న్యూఢిల్లీ : మొటొరోలా భారత్లో తాజా స్మార్ట్ఫోన్ జీ31ను లాంఛ్ చేసింది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ హెలియో జీ85 చిప్సెట్తో ముందుకొచ్చిన ఈ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్పై రన్ అవుతుంది.బడ్జెట్ ఫోన్గా ముందుకొచ్చిన జీ31 రూ 12,999 నుంచి టాప్ మోడల్ రూ 14,999కి అందుబాటులో ఉంది.
రెడ్మి 10 ప్రైం, రియల్మి నార్జో 50ఏలకు ఇది దీటైన పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. 20డబ్ల్యూ చార్జింగ్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ఈ స్మార్ట్ఫోన్ లభిస్తుంది. 4జీబీ, 6జీబీ ర్యాం మోడల్స్లో లభించే జీ31 బేబీ బ్లూ, గ్రే కలర్సలో అందుబాటులో ఉంది.