కరీంనగర్ : జిల్లాలోని వీణవంక మండలం బొంతుపల్లి గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భాగ్యమ్మ(45) అనే మహిళ పిడుగుపాటుకు గురై మృతి చెందింది. వరి నాటు వేస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో భాగ్యమ్మ పొలంలొనే మృతిచెందింది. కాగా మరో మహిళ బావు ఐలమ్మకు స్వల్ప గాయాలయ్యాయి.