Lava : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ లావా తొలి స్మార్ట్వాచ్ను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. భారత్కే ప్రత్యేకంగా లాంఛ్ చేసే ఈ స్మార్ట్వాచ్లో ఏఐ ఫీచర్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. ఈ ఏఐ ఆధారిత స్మార్ట్వాచ్ ధర రూ. 4000లోపు ఉంటుందని, ఇది అన్ని స్టోర్స్తో పాటు ఆన్లైన్లోనూ లభిస్తుందని చెబుతున్నారు.
ఇప్పటికే స్మార్ట్వాచ్లను విక్రయిస్తున్న ఫైర్ బోల్ట్, నాయిస్, బోట్ వంటి బ్రాండ్స్కు దీటుగా లావా తన స్మార్ట్వాచ్ను లాంఛ్ చేయనుంది. ప్రస్తుతం బేసిక్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లకే పరిమితమైన లావా స్మార్ట్వాచ్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది.
షియామి, ఒప్పో, వన్ప్లస్, వివో వంటి ఇతర స్మార్ట్ఫోన్ కంపెనీలు ఇప్పటికే స్మార్ట్వాచ్లు, ఇతర వియర్బుల్ గాడ్జెట్స్ను విక్రయిస్తున్నాయి. ఇక రూ. 10,000 రూ. 20,000 ధరల శ్రేణిలో లావా ప్రస్తుతం వేగంగా ఎదుగుతున్న స్మార్ట్ఫోన్ బ్రాండ్గా నిలిచిందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ డేటా వెల్లడిస్తోంది. ఇక స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోనూ తనదైన ముద్ర వేసేందుకు లావా భారీ ప్రణాళికతోనే ఎంట్రీ ఇస్తున్నట్టు చెబుతున్నారు.
Read More :