సాధారణంగా ఏ సాఫ్ట్వేర్ను డెవలప్ చేసినా ఏదో ఒక చిన్న లోపం ఉంటూనే ఉంటుంది. దాన్నే ఎర్రర్ అంటారు. లేదా బగ్ అంటారు. ఆ బగ్ను రెక్టిఫై చేయడానికి కోడింగ్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఆ బగ్.. హ్యాకర్స్కు చాన్స్ ఇస్తుంది. దాని ద్వారా సాఫ్ట్వేర్లోకి చొరబడి దాన్ని హ్యాక్ చేస్తుంటారు. 2021లో ఐఫోన్ విషయంలో కూడా అదే జరిగింది.
ఇజ్రాయెల్కు చెందిన నిఘా సంస్థ ఎన్ఎస్వో గ్రూప్ ఐఫోన్లలో ఉన్న చిన్న లోపాన్ని టార్గెట్ చేసుకొని ఐఫోన్లలోకి ఫిషింగ్, హానికరమైన లింక్స్ను పంపించి.. ఐఫోన్ ఓనర్ సమ్మతి లేకుండానే వాటంతట అవే క్లిక్ అయ్యేలా చేసి తద్వారా ఆ ఫోన్ను హ్యాక్ చేయగలిగింది. దానితో పాటు క్వాడ్రీమ్ అనే మరో కంపెనీ కూడా ఐఫోన్ను హ్యాక్ చేయగలిగింది. జీరో క్లిక్ అనే హ్యాకింగ్ టెక్నిక్ ద్వారా.. ఐఫోన్లలోకి ఫిషింగ్ లింక్స్ను పంపించగలిగాయి.
చాలామంది ఐఫోన్స్ అంటే చాలా సెక్యూర్డ్గా ఉంటాయి. వాటిని హ్యాక్ చేయలేరు అని అనుకుంటారు.. కానీ ఐఫోన్లకు కూడా హ్యాక్ చేయొచ్చు.. అనేది నమ్మలేని సత్యం.. అని ఓ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు స్పష్టం చేశాడు.
ఈ రెండు కంపెనీలు ఐఫోన్లోకి హానికరమైన లింక్స్ను పంపించి.. అవి ఓపెన్ అయ్యేలా చేసి.. ఫోన్లోని సెన్సిటివ్ డేటాను యాక్సెస్ చేసుకోగలిగాయి.
ఇది చాలా టెక్నికల్గా, అధునాతనంగా చేసే హ్యాకింగ్ టెక్నిక్ అంటూ సెక్యూరిటీ రీసెర్చర్స్ అభిప్రాయపడుతున్నారు.
ఆ తర్వాత సెప్టెంబర్ 2021లో యాపిల్ సంస్థ.. ఐఫోన్స్లోని ఆ లోపాన్ని సరిదిద్దింది. అలాగే.. ఫోన్లలోకి కావాలని చొచ్చుకొచ్చిన రెండు కంపెనీలపై యాపిల్ దావా కూడా వేసింది. యాపిల్ యూజర్ టర్మ్స్ అండ్ సర్వీసెస్ను ఆ కేసు ఇప్పటికీ కోర్టులోనే నానుతోంది.