న్యూఢిల్లీ : యాపిల్ ఇటీవల ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ను లాంఛ్ చేయగా నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్పై హాట్ డిబేట్ సాగుతోంది. వచ్చే ఏడాది ఐఫోన్ 15 అల్ట్రాతో యాపిల్ కస్టమర్ల ముందుకు రానుందని చెబుతున్నారు. ఐఫోన్స్ ప్రొ మ్యాక్స్ వేరియంట్స్ను కూడా యాపిల్ రీప్లేస్ చేయనుంది. అత్యంత ఖరీదైన, మోస్ట్ ప్రీమియం ఫోన్గా ఐఫోన్ 15 అల్ట్రాను తీసుకువచ్చేందుకు యాపిల్ కసరత్తు సాగిస్తోంది. ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ కంటే ఐఫోన్ 15 అల్ట్రా ధర అధికంగా ఉంటుందని టెక్ నిపుణులు లీక్స్యాపిల్ప్రొ ట్వీట్ వెల్లడించింది. ఈ ట్వీట్ అంచనా నిజమైతే ఐఫోన్ 15 అల్ట్రా భారత్లో రూ 1,39,000పైమాటేనని చెబుతున్నారు.
భారత్లో ఐఫోన్ 15 అల్ట్రా ప్రారంభధర రూ 1.5 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. కొత్తగా లాంఛ్ అయిన యాపిల్ వాచ్ సిరీస్ 8తో పోలిస్తే యాపిల్ వాచ్ అల్ట్రా ధర దాదాపు రెట్టింపుగా ఉండటం గమనార్హమని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ ప్రస్తుతం భారత్లో రూ 1.39 లక్షలకు అందుబాటులో ఉండగా ఐటీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ 1.89 లక్షలు పలుకుతోంది.
యాపిల్ వాచ్ అల్ట్రా తరహాలో ఐఫోన్ 15 అల్ట్రాకు సైతం యాపిల్ భిన్నమైన మెటీరియల్ను యాపిల్ వాడుతుందని చెబుతున్నారు. అదే జరిగితే ఐఫోన్ 15 మరింత మన్నిక కోసం టైటానియం బిల్డ్ ఫీచర్ కలిగిఉంటుంది. ఆప్టికల్ జూమ్ సామర్ధ్యం మెరుగుపరిచేందుకు ఐఫోన్ 15 టెలిఫొటో కెమెరాకు పెరిస్కోప్ స్టైల్ లెన్స్ను యాపిల్ అమర్చనుందని చెబుతున్నారు.
శాంసంగ్, గూగుల్కు గట్టి పోటీ ఇచ్చేలా ఐఫోన్ 15 అల్ట్రా 6x ఆప్టికల్ జూమ్కు సపోర్ట్ చేయనుంది. యాపిల్ ఐఫోన్ 15 అల్ట్రాలో నెక్ట్స్ జెన్ బయోనిక్ చిప్సెట్తో ఈ డివైజ్ మెరుగైన పెర్ఫామెన్స్ను అందించనుంది. ఇప్పటివరకూ ఏ ఐఫోన్లోనూ లేని రీతిలో యాపిల్ ఐఫోన్ 15 అల్ట్రా భారీ బ్యాటరీతో కస్టమర్ల ముందుకు రానుంది.