న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ యాపిల్ ఐఫోన్పై హాట్ డీల్ను ఆఫర్ చేస్తోంది. డిసెంబర్ 31తో ముగిసే ఇయర్ ఎండ్ సేల్లో యాపిల్ రిలీజ్ చేసిన న్యూ సిరీస్లో బేస్ మోడల్ ఐపోన్ 14 అతితక్కువ ధరలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. సేల్లో ఎంపిక చేసిన మోడల్స్పై ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ. 50,590కి లభిస్తోంది. ఐఫోన్ 14పై ఫ్లిప్కార్ట్ ఏకంగా రూ. 20,500 వరకూ డిస్కౌంట్ను అందిస్తోంది.
ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. ఈ డిస్కౌంట్లను వినియోగించుకుని ఐఫోన్ లేటెస్ట్ మోడల్ను తక్కువ ధరలోనే కస్టమర్లు సొంతం చేసుకునే వెసులుబాటు ఉంది. డిసెంబర్ 31తో ముగిసే ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగానే ఈ డిస్కౌంట్లు, ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉండటంతో తమ డ్రీమ్ ఫోన్ను దక్కించుకునేందుకు ఇదే సరైన అవకాశమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.