న్యూఢిల్లీ : ఫ్లిప్కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ సందర్భంగా ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. భారత్లో రూ 79,900కు లాంఛ్ అయిన ఐఫోన్ 13ని ప్లిప్కార్ట్ సేల్లో రూ 69,999కే ఆఫర్ చేస్తున్నారు. వినియోగదారులు ఐఫోన్ 11, ఐఫోన్ 12, ఐఫోన్ ఎస్ఈ 2022పై కూడా భారీ డిస్కౌంట్ పొందే వెసులుబాటు ఉంది.
ఫ్లిప్కార్ట్ సేల్లో ఐఫోన్ 13 128జీబీ మోడల్ రూ 69,999కి లభిస్తుండగా యాక్సిస్ బ్యాంక్ కార్డుదారులు అదనంగా పది శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఇక భారత్లో రూ 89,900కి లాంఛ్ అయిన 256జీబీ ఐఫోన్ 13 సేల్లో భాగంగా రూ 79,999కి లభిస్తోంది. ఫ్లిప్కార్ట్ సేల్లో ఐఫోన్ 13, ఐఫోన్ మినీ కాంపాక్ట్ వెర్షన్ రూ 64,999కి అందుబాటులో ఉంది. 2021లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్లలో ఒకటిగా నిలిచిన యాపిల్ ఐఫోన్ 12 ఫ్లిప్కార్ట్ సేల్లో భాగంగా రూ 53,999కి లభిస్తుంది.
ఇక 128జీబీ ఐఫోన్ 12 రూ 58,999 డిస్కౌంట్ ధరపై సేల్లో అందుబాటులో ఉంది. ఈ ఏడాది ఆరంభంలో లాంఛ్ అయిన యాపిల్ న్యూ ఐఫోన్ ఎస్ఈ 2022 సేల్లో భాగంగా రూ 46,900కి లభిస్తోంది. ఐఫోన్ 11 బేస్ మోడల్ ఫ్లిప్కార్ట్ సేల్లో రూ 41,999కి అందుబాటులో ఉంది. కాగా ఫ్లిప్కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ ఈనెల 17 వరకూ కొనసాగనుంది.