న్యూఢిల్లీ : అమెరికన్ చిప్ తయారీ కంపెనీ ఇంటెల్ (Intel layoffs) నిరాశజనక ఆర్ధిక ఫలితాలు ప్రకటించడంతో మరోసారి లేఆఫ్స్కు సన్నద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పీసీల విక్రయాలు పడిపోవడం, అంతర్జాతీయ ఆర్ధిక అనిశ్చితితో కొలువుల కోత తప్పదని భావిస్తున్నారు. కంపెనీ దీర్ఘకాల వృద్ధిని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను కుదిస్తారని బిజినెస్ టుడే వెల్లడించింది. గత ఏడాది మూడో క్వార్టర్లో కంపెనీ రాబడులు పడిపోవడంతో సెమికండక్టర్ తయారీ సంస్ధ ఇంటెల్ లేఆఫ్స్కు తెగబడింది.
కొందరు ఉద్యోగుల ఫ్యాక్టరీ పని గంటలు తగ్గించడం ద్వారా ఖర్చులను తగ్గించే ప్రక్రియ చేపట్టామని అప్పట్లో కంపెనీ చెప్పుకొచ్చింది. అప్పట్లో ఇంటెల్ ప్రకటించిన తొలి దశ లేఆఫ్స్లో కంపెనీ బెంగళూర్ కార్యాలయంలోనూ పలువురు ఉద్యోగులు కొలువులు కోల్పోయారు. గత నెల ఇంటెల్ ప్రకటించిన తొలి క్వార్టర్ ఆర్ధిక ఫలితాల్లో రాబడులు ఏకంగా 36 శాతం పతనమవడంతో మలి దశ లేఆఫ్స్పై టెకీల్లో గుబులు రేగుతోంది.
అయితే లేఆఫ్స్లో కొలువులు కోల్పోయిన ఉద్యోగులు టెర్మినేషన్ లెటర్స్ పంపారా లేదా అన్న వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. స్ధూల ఆర్ధిక వాతావరణాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలను ఇంటెల్ వేగవంతం చేస్తోందని, పలు విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను కుదించడం సహా పలు వ్యయ నియంత్రణ చర్యలను చేపడుతున్నామని కంపెనీ పేర్కొంది. ఇది సంక్లిష్ట నిర్ణయమని, లేఆఫ్స్ ప్రభావానికి లోనయ్యే ఉద్యోగుల పట్ల సానుభూతితో, గౌరవంతో వ్యవహరిస్తామని తెలిపింది.
Read More