జైపూర్ : అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్)లో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం న్యూ పార్ట్టైం ఆన్లైన్ ఎంటెక్ ప్రోగ్రాంను ఐఐటీ జోధ్పూర్ లాంఛ్ చేస్తోంది. ఐహబ్ దృష్టి ఫౌండేషన్ సహకారంతో 2022-23 నుంచి ఈ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సు అప్లికేషన్ కోసం జూన్ 17 వరకూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
అగ్మెంటెడ్, వర్చువల్ రియాలిటీ వంటి వినూత్న రంగాలకు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో ఈ దిశగా పరిశోధన, అభివృద్ధికి సపోర్ట్ చేసేలా ఐఐటీ జోధ్పూర్ స్కూల్ ఆఫ్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డేటా సైన్స్ విభాగం వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఈ ప్రోగ్రాంను చేపట్టింది. ఈ కోర్సులో భాగంగా విద్యార్ధులకు ఇనిస్టిట్యూట్లోని అత్యాధునిక ఏఆర్, వీఆర్ టూల్స్పై పనిచేసే వెసులుబాటు కలుగుతుంది.
ఏఆర్, వీఆర్ అప్లికేషన్స్ను డిజైన్ చేసి డెవలప్ చేసే నైపుణ్యాలను కలిగిన ఇంజనీర్లను తయారు చేయడం, ఏఆర్, వీఆర్ సిస్టమ్స్ ప్రాబ్లమ్స్ను పరిష్కరించడం, పరిశోధనా నైపుణ్యాలను మెరుగుపరడం వంటి ఉద్దేశాలతో ఈ ప్రోగ్రాంకు రూపకల్పన చేసినట్టు ఐఐటీ జోధ్పూర్ వర్గాలు వెల్లడించాయి.