Ransomware | రోజురోజుకీ హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ఈ సైబర్ నేరగాళ్ల వలలో కేవలం సాధారణ వ్యక్తులు మాత్రమే కాకుండా పెద్ద పెద్ద కంపెనీలు కూడా పడిపోయి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇలా సాఫ్ట్వేర్ కంపెనీలు.. కార్పొరేట్ సంస్థలను గజగజలాడిస్తున్న మాల్వేర్లలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రాన్సమ్వేర్. రెండేళ్ల క్రితం 80 శాతం మంది భారతీయ కంపెనీలు ఈ రాన్సమ్వేర్ బారిన పడగా.. మన హైదరాబాద్లో బాధిత కంపెనీలు 74 శాతంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రాన్సమ్వేర్ అంటే ఏంటి? అది ఎలా దాడి చేస్తుంది? దాని నుంచి ఎలా రక్షణ పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా కంప్యూటర్ వైరస్లు ఒక కంప్యూటర్లోని ఫైళ్లను కరెప్ట్ చేస్తే.. మాల్వేర్లు మొత్తం కంప్యూటర్లనే హ్యాకర్ల నియంత్రణలోకి తీసుకెళ్తాయి. ఇలాంటి మాల్వేర్ల్లో రాన్సమ్వేర్ అత్యధిక ప్రమాదకరమైనది. ఒక్కసారి ఈ మాల్వేర్ మన కంప్యూటర్లోకి ప్రవేశిస్తే.. దానిద్వారా నెట్వర్క్లోని అన్ని కంప్యూటర్లు, చివరగా సర్వర్లోనూ ఇది చొరబడుతుంది. ఈ మాల్మేర్ కంప్యూటర్లోకి ప్రవేశించగానే.. నెమ్మదిగా అన్ని ఫైల్స్, ఫోల్డర్లను ఎన్క్రిప్ట్ చేసేస్తుంది. దీంతో కంప్యూటర్ లాక్ అయిపోతుంది. అప్పుడు వాటిని ఓపెన్ చేయడం సాధ్యం కాదు. వీటిని ఓపెన్ చేయాలంటే హ్యాకర్లు అడిగిన డబ్బులు చెల్లించుకోవాల్సిందే.
పైరెటెడ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ( ఓఎస్)లోని లొసుగుల ఆధారంగా హ్యాకర్లు ఈ మాల్వేర్ సహాయంతో దాడికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఓఎస్లోని ఎన్టీఎల్ఎం ( న్యూటెక్నాలజీ ల్యాన్ మేనేజర్) సెక్యూరిటీ ప్రోటోకాల్ సర్వీస్ మెసేజ్ బ్లాక్ (ఎస్ఎంబీ) ప్రోటోకాల్ హ్యాకర్లకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఒక కంపెనీలో ఒక్క కంప్యూటర్లో పైరసీ ఓఎస్ ఉన్నా.. దాని ద్వారా నెట్వర్క్లోని అన్ని కంప్యూటర్లకు ఈ రాన్సమ్వేర్ విస్తరిస్తుంది.
డాటా బ్యాకప్: రాన్సమ్వేర్ బారినపడ్డా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనుకుంటే మన డాటాను బ్యాకప్ చేసుకోవాలి. రాన్సమ్వేర్ పంపి మన డాటాను ఎన్క్రిప్ట్ చేసినా బ్యాకప్తో సేవ్ అవ్వొచ్చు.
అనుమానాస్పద లింక్లు ఓపెన్ చేయవద్దు: చాలావరకు రాన్సమ్వేర్ దాడుల్లో లింక్లు, అటాచ్మెంట్లను పంపి చేసేవే. అందుకే అనుమానాస్పద లింక్లు, అటాచ్మెంట్లను తెరువొద్దు.
అప్డేటెడ్ యాంటీవైరస్ తప్పనిసరి: కంప్యూటర్లో అప్డేటెడ్ యాంటీవైరస్ను తప్పక పెట్టుకోవాలి.
సైబర్ సెక్యూరిటీ పాలసీ: యూజర్ యాక్సెస్ కంట్రోల్, పాస్వర్డ్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా రూల్స్పై అవగాహన కలిగి ఉండాలి.
ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్: సైబర్ ఎటాక్ జరిగితే ఎలా డాటా రికవరీ చేసుకోవాలన్నదానికి ఒక ముందస్తు ఎమర్జెన్సీ రివకరీ ప్లాన్ తప్పనిసరి.
సైబర్ సెక్యూరిటీపై శిక్షణ: కంపెనీ లేదా సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ సైబర్ సెక్యూరిటీ అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించాలి. దీనివల్ల సైబర్ దాడులు ఎలా జరుగుతాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అన్నది తెలుస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Apple iPhone : ఐఫోన్ స్లో అవుతోందా? ఈ ట్రిక్స్ ఫాలో అయితే ఫోన్ సూపర్ స్పీడ్లో పనిచేస్తుంది
Best Smartphones under Rs.10000: రూ.10 వేల లోపు లభించే బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే