Chandrayaan-3 | చంద్రయాన్-3 ప్రయోగం అన్ని విధాలుగా విజయవంతం అవుతుందని ఇస్రో మాజీ చైర్మన్ జీ మాధవన్ నాయర్ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రుడి ఉపరితలంపై ఇస్రో ప్లాన్ చేసిన సాఫ్ట్ ల్యాండింగ్ సంక్లిష్టమైందని పేర్కొన్నారు. ఆయన జాతీయ మీడియా సంస్థతో గురువారం మాట్లాడారు. మిషన్ ఇస్రోకు ఓ మైలురాయి అన్నారు. నాలుగేళ్ల కిందట చంద్రయాన్-2 సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో ఎదురైన సమస్యలు, సవాళ్లను దృష్టిలో పెట్టుకొని ఈ సారి వ్యవస్థను పటిష్టం చేసిందన్నారు. ఈ మిషన్ అన్ని విధాలుగా విజయవంతం కావాలని, తద్వారా మనం అంతరిక్ష పరిశోధనలో ఓ ముఖ్యమైన మైలురాయిని దాటగలమన్నారు.
ప్రయోగ సమయంలో ఎలాంటి తప్పులు జరుగకూడదని, జాగ్రత్తగా ఉండాలన్నారు. అయితే, మనం ఏమీ చెప్పలేమని.. అనే వ్యవస్థలు, విభాగాలు పని చేసే పెద్ద ప్రోగ్రామ్ అన్నారు. చిన్న పొరపాటు జరిగినా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ప్రస్తుతం ప్రీలాంచ్కు సన్నాహాలు జరుగుతున్నాయని, శాస్త్రవేత్తలు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తారన్నారు. ఇదిలా ఉండగా.. చంద్రయాన్-3 మిషన్కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. మిషన్ను శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు లాంచ్ వెహికల్ మార్క్ III నింగిలోకి దూసుకెళ్లనున్నది.