న్యూఢిల్లీ : ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ డిసెంబర్ 31తో ముగుస్తుండగా తక్కువ ధరలో అందుబాటులో ఉన్న డివైజ్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇయర్ ఎండ్ సేల్లో భాగంగా ఈ-కామర్స్ దిగ్గజం పిక్సెల్ 6ఏ, ఐఫోన్ 13, నథింగ్ ఫోన్(1) ఇతర 5జీ ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. 2022 ఫోన్లపైనా సేల్లో కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్లో ఐఫోన్ 13పై భారీ తగ్గింపును ఈకామర్స్ దిగ్గజం ప్రకటించింది.
ఐఫోన్ 14 సిరీస్ను పోలిన ఐఫోన్ 13ను లేటెస్ట్ ఆఫర్లు, డిస్కౌంట్లపై తక్కువ ధరకే కస్టమర్లు సొంతం చేసుకునే వెసులుబాటు ఉంది. ఐపోన్ 13 128జీబీ మోడల్ ఒరిజినల్ ప్రైస్ రూ.69,900 కాగా సేల్లో రూ .61,999కి లభిస్తోంది. దీంతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్, హెచ్డీఎఫ్సీ కార్డుదారులకు లభించే ఆఫర్లను మినహాయిస్తే అత్యంత ఆకర్షణీయ ధరకు ఐఫోన్ 13ను సొంతం చేసుకోవచ్చు. ఇక మెరుగైన కెమెరా సామర్ధ్యం, వేగవంతమైన పెర్ఫామెన్స్ కోసం శాంసంగ్ గెలాక్సీ ఎస్22+ 5జీ ఫోన్పైనా ఇయర్ ఎండ్ సేల్లో భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ హాట్ డివైజ్ రూ .69,999కి సేల్లో ఆఫర్లో ఉండగా, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై పది శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్తో ఈ లేటెస్ట్ ఫోన్ను మరింత తక్కువ ధరకే పొందే అవకాశం ఉంది. ఇక రూ .30,000 బడ్జెట్లో మెరుగైన కెమెరా ఫీచర్స్ కలిగిన ఫోన్ కోసం చూసే వారు పిక్సెల్ 6ఏను కొనుగోలు చేయవచ్చు. ఈ 5జీ ఫోన్ ఈ ఏడాది ఆరంభంలో రూ.43,999 పలుకగా ఇప్పుడు దాని ధర రూ .29,900కు పడిపోయింది. ఈ డివైజ్పైనా ఫ్లిప్కార్ట్ ఆఫర్లు ప్రకటించింది. మోటో ఎడ్జ్ 30పైనా ఈకామర్స్ దిగ్గజం ఆకర్షణీయ డీల్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ. 15,000లోపు మెరుగైన 5జీ ఫోన్ కోసం అన్వేషించే వారు శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23ని పరిశీలించవచ్చు. ఆఫర్లపై ఈ స్మార్ట్ఫోన్ కేవలం రూ .13,499కే అందుబాటులో ఉంది.