హైదరాబాద్, జులై 3:ట్రాక్టర్ల టైర్లలో నీరు ఎందుకు పోస్తారనేది చాలా మందికి తెలియదు. అసలు ట్రాక్టర్ టైర్లలో నీళ్లు పోస్తారా..? ఒకవేళ పోస్తే ఎంత మోతాదులో పోయాలి, అసలు దీని వల్ల ఉపయోగం ఏమిటంటే..?
-టైర్లు జారిపోకుండా ఉండటానికి, టైర్ల బరువును పెంచడానికి నీటిని పోస్తారు. ట్రాక్టర్ టైర్లలో నీటిని నింపడం వల్ల అవి ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయి. అంతేకాదు ట్రాక్టర్లు ఎటువంటి రోడ్డులో అయినా సజావుగా నడుస్తాయి.
-వీటిలో నీటిని నింపడం వల్ల మరింత ఎక్కువ రోజులు ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. ట్రాక్టర్ టైర్లలో నీటిని నింపేటప్పుడు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ట్యూబ్లోని 75శాతం తప్పనిసరిగా నీటితో నింపాలి. మిగిలిన గ్యాప్ ను గాలితో నింపాలి.
-టైర్లను నీటితో నింపడం వల్ల ట్రాక్టర్ స్థిరత్వాన్ని ఇస్తుంది. ట్రాక్టర్కు స్థిరత్వాన్ని అందించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. టైర్లను నీటితో నింపడం సరళమైన పద్ధతి, ఇది ఖర్చు తక్కువగా కూడా. టైర్లను నీటితో నింపడం వల్ల ట్రాక్టర్ బరువు పెరుగుతుంది, దీని ద్వారా మంచి పట్టు అందిస్తుంది.
-కొన్ని దేశాలలో అయితే ట్రాక్టర్ టైర్లలో నీటికి బదులుగా కాల్షియం క్లోరైడ్ ద్రావణాన్ని నింపుతారు. చల్లటి దేశాలలో టైర్లను నీటితో సులభంగా నింపలేరు. కాబట్టి అటువంటి ప్రాంతాల్లోఇలాంటి పద్ధతి అనుసరిస్తుంటారు. ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో టైర్ల లోపల నీరు గడ్డకట్టే అవకాశం ఉంటుంది. అందుకోసమే నీటికి బదులుగా కాల్షియం క్లోరైడ్ ద్రావణాన్ని నింపుతారు.
-నీటికి బదులుగా కాల్షియం క్లోరైడ్ ద్రావణాన్ని ఉపయోగించడానికి కూడా చాలా కారణాలున్నాయి. తక్కువ ఉష్ణోగ్రతలో కూడా గడ్డకట్టదు. అంతే కాకుండా కాల్షియం క్లోరైడ్ ద్రావణం నీటి కంటే 30శాతం ఎక్కువ బరువు ఉంటుంది. అంతేకాదు ఇది టైర్ ను గానీ ట్యూబ్ను గానీ నలగనివ్వదు.