Disney+ | ఇప్పుడు డిజిటల్ ఓటీటీ వేదికల మధ్య ఆధిపత్య పోరు మొదలైనట్లు కనిపిస్తున్నది. ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్లు ప్రసారం చేస్తుండటంతో ఓటీటీ వేదికల వీక్షకులు పూర్తిగా జియో సినిమా వైపు మళ్లినట్లు తెలుస్తున్నది. జియో సినిమా యాప్ ప్రభావంతో ఇప్పటి వరకు దేశంలో టాప్ డిజిటల్ స్ట్రీమింగ్ సర్వీస్ సంస్థ డిస్నీ + హాట్ గత ఏడాది కాలంలో స్టార్ 46 లక్షల మంది సబ్ స్క్రైబర్లను కోల్పోయిందని సీఎల్ఎస్ఏ అనే సంస్థ పేర్కొంది. గత త్రైమాసికంలో డిస్నీ + హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్లు 5.29 కోట్లకు పడిపోయాయని తెలిపింది. డిసెంబర్ త్రైమాసికం నాటికి 6.13 కోట్లుగా ఉన్న సబ్ స్క్రైబర్లు.. మార్చి నెలాఖరు నాటికి 38 లక్షల మంది తగ్గిపోయారు.
సబ్ స్క్రైబర్లను కోల్పోవడంతో డిస్నీ + హాట్ స్టార్ సగటు ఆదాయం రూ.60 నుంచి రూ.48కి పడిపోయిందని తెలిపింది. డిస్నీ+ హాట్ స్టార్ అర్పు రేటు పతనానికి ఐపీఎల్ డిజిటల్ హక్కులు కోల్పోవడమేనని సీఎల్ఎస్ఏ స్పష్టం చేసింది.
ప్రస్తుతం 2023 నుంచి ఐదేండ్ల పాటు ఐపీఎల్ ప్రసార హక్కులను వయాకాం 18 సంస్థ సొంతం చేసుకున్నది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలో నడుస్తున్న సంస్థ. దీంతో డిస్నీ + హాట్ స్టార్ సబ్ స్క్రైబర్లను కోల్పోయిందని సీఎల్ఎస్ఏ వాదించింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో మ్యాచ్ లను ఫ్రీగా జియో సినిమా ఆఫర్ చేస్తున్నది. వచ్చే నాలుగేండ్లు డిస్నీ స్టార్, వయాకాం 18 మధ్య ఐపీఎల్ మానిటైజ్ హక్కుల పోరాటం మరింత పెరుగుతుందని సీఎల్ఎస్ఏ తెలిపింది. డిస్నీ స్టార్.. ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులు 3.1 బిలియన్ డాలర్లకు గెలుచుకున్నది.