ఎట్టెట్టా.. బ్లాక్చైన్ టెక్నాలజీలో పెళ్లా.. అలా ఎలా సాధ్యం. అది ఒక టెక్నాలజీ కదా. దాంట్లో పెళ్లి ఎలా చేసుకుంటారు అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. కానీ.. ఇది సాధ్యమే.. ఇప్పటికే మెటావర్స్లో పెళ్లి చేసుకోవడం చూశాం కదా. ఇప్పుడు బ్లాక్చైన్ టెక్నాలజీ ద్వారా ఓ జంట ఏకమైంది. దీంతో భారత్లోనే ఇది తొలి బ్లాక్చైన్ టెక్నాలజీ పెళ్లిగా చరిత్రకెక్కింది.
మహారాష్ట్రలోని పూణెకు చెందిన అనిల్ నారాసిపురం, శృతి నయ్యర్.. ఇద్దరికీ గత సంవత్సరం నవంబర్లో పెళ్లి అయింది. అదేదో మామూలుగా జరిగిన పెళ్లి కాదు. బ్లాక్చైన్ టెక్నాలజీతో జరిగిన పెళ్లి. అందుకే అది యూనిక్ వెడ్డింగ్ అయింది.
కరోనా సమయం కావడంతో చాలా తక్కువ మంది అతిథుల సమక్షంలో అనిల్ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీంతో అతడికి కోర్టు వెడ్డింగ్ గుర్తొచ్చింది. దీంతో అనిల్, శృతి ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. రిజిస్టర్ మ్యారేజ్ అంటే కేవలం కోర్టు ఇచ్చిన సర్టిఫికెట్ మాత్రమే ఉంటుంది. కానీ.. తమ పెళ్లిని ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలనుకున్నారు. ఆన్లైన్లో తమ పెళ్లిని ఎన్ఎఫ్టీల రూపంలో భద్రపరచాలని అనుకున్నారు. దీంతో బ్లాక్చైన్ టెక్నాలజీని ఉపయోగించుకున్నారు.
దాని కోసం ఎథీరియం స్మార్ట్ కాంట్రాక్ట్ను ఉపయోగించారు. ఓపెన్సీ అనే ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్లో తమ పెళ్లి ప్రమాణాలను చేసి అందులో లిస్ట్ చేశారు. పెళ్లి కూతురు ఎంగేజ్మెంట్ రింగ్తోపాటు.. వాళ్లు పెళ్లికి చేసిన ప్రమాణాలతో ఫోటోను క్రియేట్ చేసి ఎన్ఎఫ్టీలో లిస్ట్ చేశారు.
వీళ్ల పెళ్లిని బ్లాక్చైన్ స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా అనూప్ పక్కి అనే డిజిటల్ పూజారి జరిపించాడు. దాని కోసం ముందుగానే వాళ్లు మెటామాస్క్ అనే క్రిప్టో కరెన్సీ వాలెట్స్ను అనిల్, శృతి సెటప్ చేసుకున్నారు. ఆ తర్వాత.. వాళ్ల పూజారి అనూప్.. ఎన్ఎఫ్టీ మార్కెట్ ఓపెన్సీలో వాళ్ల పెళ్లి ఉంగరం, పెళ్లి ప్రమాణాలతో తయారు చేసిన ఫోటోను లిస్ట్ చేశాడు. ఆ తర్వాత దాన్ని అనిల్, శృతికి ట్రాన్స్ఫర్ చేశాడు.
ఆ తర్వాత పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని గూగుల్ మీట్లో క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య రిసెప్షన్ జరుపుకున్నారు. ఆ తర్వాత ఎన్ఎఫ్టీలో లిస్ట్ చేసిన ఉంగరం ఫోటోలో ఉన్న పెళ్లి ప్రమాణాలను ఇద్దరూ చదివారు. ఆ తర్వాత ఆ ఎన్ఎఫ్టీని పెళ్లికూతురు డిజిటల్ వాలెట్లోకి పంపించాడు. దీంతో ఇద్దరి పెళ్లి అయిపోయింది.
ఎథీరియం బ్లాక్చైన్లో ఆ ట్రాన్సాక్షన్ పర్మినెంట్గా ఉండిపోతుంది. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. తమ పెళ్లికి సంబంధించిన కమిట్మెంట్ అదేనంటూ అనిల్ ఇటీవల ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. తన పెళ్లి ఫోటోలను, ఎన్ఎఫ్టీని కూడా పోస్ట్ చేయడంతో వాళ్ల బ్లాక్చైన్ వెడ్డింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్లాక్చైన్లో పెళ్లిచేసుకున్న మొదటి జంట మేమే కావచ్చు కానీ.. ఇది ఇంతటితో ఆగదు. త్వరలో ఇలాంటి బ్లాక్చైన్ వెడ్డింగ్లను చాలా చూస్తారు.. అని అనిల్ ట్విట్టర్లో రాసుకొచ్చాడు.
After gathering some close family and friends in a Google Meet, @shrutinair1 and I sat next to each other on our laptops and completed the transaction in a short online ceremony hosted by @anoop_V1. (5/8) pic.twitter.com/rgHrkCqhLK
— Anil N (@vaayustudios) January 22, 2022
ఇటీవల తమిళనాడులో ఓ జంట తమ పెళ్లి రిసెప్షన్ను మెటావర్స్లో జరపుకుంది. డిజిటల్ అవతార్ రూపంలో గెస్టులు మెటావర్స్లో వాళ్ల రిసెప్షన్కు హాజరయ్యారు. ఆ రిసెప్షన్లో పెళ్లికూతురు చనిపోయిన తండ్రి కూడా అటెండ్ అయి నూతన వధూవరులను ఆశీర్వదించాడు. పెళ్లికూతురు తండ్రి డిజిటల్ అవతార్ను తయారు చేసి మెటావర్స్లో వాళ్ల రిసెప్షన్లో యాడ్ చేయడంతో అది సాధ్యం అయింది.
వెస్ట్ బెంగాల్లో కూడా ఓ జంట గూగుల్ మీట్లో పెళ్లి చేసుకుంది. గూగుల్ మీట్లో పెళ్లి తర్వాత.. అతిథులందరికీ జొమాటో ద్వారా వాళ్ల ఇళ్లకే పెళ్లి భోజనాన్ని పంపించారు.
The transaction took a few minutes (and about $35 in ETH gas fees) after which we were pronounced husband and wife by @anoop_V1
"By the power vested in me by ethereum…" (7/8) pic.twitter.com/Qg2Y2nd9js— Anil N (@vaayustudios) January 22, 2022
We may be the first couple married on the blockchain in India (AFAIK), but it certainly won't be the last. Cryptocurrency and blockchain represent a significant change in the way we transact and and the way we trust. This is just the #NFTs #NFTCommunity
— Anil N (@vaayustudios) January 22, 2022