బెంగళూరు: చంద్రయాన్ 2( Chandrayaan-2 ) ల్యాండర్ చంద్రుడిపై దిగడంలో విఫలమై కూలిపోయినా.. ఆర్బిటర్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. ఇప్పటికే ఇది చంద్రుడి చుట్టూ 9 వేల సార్లు తిరిగిందని ఇస్రో సోమవారం వెల్లడించింది. ఇందులో భాగంగా ఇప్పటికే అద్భుతమైన సమాచారాన్ని భూమికి చేరవేసినట్లు ఇండియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-2 వెళ్లి రెండేళ్లయిన సందర్భంగా సోమవారం నుంచి రెండు రోజుల పాటు లూనార్ సైన్స్ వర్క్షాప్ 2021ని ఇస్రో నిర్వహిస్తోంది.
ఈ వర్క్షాప్ ప్రారంభం సందర్భంగా ఇస్రో చైర్మన్ కే శివన్ మాట్లాడుతూ.. చంద్రయాన్-2 స్పేస్క్రాఫ్ట్లోని 8 పరికరాలు రిమోట్ సెన్సింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇది భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లు తెలిపారు. ఈ రెండేళ్లలో ఈ చంద్రయాన్-2 పంపించిన డేటాను శివన్ బయటపెట్టారు.