Boeing Space Station | విమానాల తయారీ సంస్థ బోయింగ్.. కొత్త రంగంలోకి దిగింది. అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించి అంతరిక్షంలోకి పంపేందుకు బోయింగ్ కసరత్తు చేస్తున్నది. బోయింగ్ కంపెనీ ఇంతకు ముందు మానవ రహిత అంతరిక్ష కేంద్రాలను పంపింది. అయితే, ఈసారి మానవులతో పంపేందుకు సిద్ధమైంది. ఈ మిషన్ కోసం నాసాకు చెందిన ఇద్దరు సీనియర్ సైంటిస్టులు బుచ్ విల్మోర్తో పాటు భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ ఎంపికయ్యారు. బోయింగ్ స్టార్లైనర్ మిషన్ విజయవంతమైతే అంతరిక్ష పర్యాటకానికి కొత్త తలుపులు తెరుచుకుంటాయి.
ఇప్పటివరకు చాలా అంతరిక్ష నౌకలు మానవులను అంతరిక్షంలోకి తీసుకెళ్లాయి. అయితే, బోయింగ్ స్టార్లైనర్ కాలిప్సో.. మానవులను మోసుకెళ్లే మొదటి మిషన్ కానున్నది. సునీతా విలియమ్స్ కుటుంబానికి చెందిన సన్నిహితురాలు ఈ సమాచారాన్ని వెల్లడించింది. నిజానికి ఈ మిషన్ 2022 జూలైలో చేపట్టాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా ఏడాది పాటు వాయిదా పడింది. కాగా, ఇప్పుడు ఏప్రిల్ రెండో లేదా మూడో వారంలో బోయింగ్ స్టార్లైనర్ కాలిప్సో అనే ఈ చిన్న వాహనం ఇద్దరు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నది. వీరిద్దరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో రెండు వారాల పాటు ఉంటారు. స్పేస్ షటిల్ అంతరిక్ష కక్ష్యలో ఎక్కువ కాలం ఉంటుండగా.. బోయింగ్ స్టార్లైనర్కక్ష్యలో ఎక్కువ సేపు ఉండలేదు. స్పేస్క్రాఫ్ట్ ఎక్కువ వస్తువుల్ని తీసుకెళ్లుండగా.. బోయింగ్ స్టార్లైనర్ కూడా ఎక్కువ పరికరాలను మోసుకెళ్లగలదు.
సునీతా విలియమ్స్ అంతరిక్షంలో ఎన్నో విజయాలు అందుకున్నది. అమెరికాలో అత్యధిక స్టామినా ఉన్నవారి జాబితాలో సునీత రెండో స్థానంలో నిలిచింది. అంతరిక్షంలో ఎక్కువ సమయంపాటు గడిపిన మహిళా వ్యోమగామిగా రికార్డులకెక్కింది. 1998లో వ్యోమగామిగా ఎంపికైన సునీతా విలియమ్స్.. నాసాలో అంతరిక్ష శిక్షణ పొందింది. మాస్కోలోని రష్యన్ స్పేస్ ఏజెన్సీతో అంతరిక్ష కేంద్రంలో మొదటి మిషన్ సిబ్బందితో కలిసి ఆమె పనిచేశారు. ఇప్పుడు అంతా సవ్యంగా జరిగితే బోయింగ్ స్టార్లైనర్ క్యాప్సూల్లో సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి మరోసారి వెళ్లగలదు.