భారత్లో ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చిన రూ 15,000లోపు స్మార్ట్ పోన్లు అందుబాటైన ధరలో, మెరుగైన ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకున్నాయి. నెక్ట్స్ వెర్షన్స్ కోసం ఏడాది పాటు వేచిచూడని వారికి రూ 15,000లోపు భారత్లో లభించే టాప్ స్మార్ట్ఫోన్లపై ఓ లుక్కేయవచ్చు. షియోమి, రియల్మి, పోకో సహా పలు బ్రాండ్లు మెరుగైన బడ్జెట్ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టాయి.
పోకో ఎం3 ప్రొ 5జీ- రూ 13,999
పోకో ఎం3కి కొనసాగింపుగా ఈ ఏడాది మేలో పోకో ఎం3 ప్రొ లాంఛ్ అయింది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్షిటీ 700 ప్రాసెసర్తో ఈ స్మార్ట్ఫోన్ 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో ఆకట్టుకుంటుంది.
రియల్మి నార్జో 50ఏ- రూ 11,499
గేమింగ్ ఫోన్గా చెబుతున్న రియల్మి నార్జో 50ఏ డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరాల సమ్మిళిత డివైజ్గా ముందుకొచ్చింది. హెచ్డీ+ రిజల్యూషన్తో 6.5 ఇంచ్ డిస్ప్లే, మీడియాటెక్ హిలియో జీ85 ప్రాసెసర్తో ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్మి యూఐ 2.0పై రన్ అవుతుంది.
రెడ్మి నోట్ 10ఎస్- రూ 14,999
షియామి నుంచి స్లీక్, కాంపాక్ట్, కంఫర్టబుల్ డిజైన్తో రెడ్మి నోట్ 10ఎస్ కస్ఠమర్లను ఆకట్టుకుంది. బ్యాక్ డ్యూయల్ టోన్ ఫినిష్తో సింపుల్, ఎలిగెంట్ డిజైన్తో ఈ ఫోన్ ముందుకొచ్చింది. 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో మీడియాటెక్ హిలియో జీ85 ప్రాసెసర్ను కలిగిఉంది.
రియల్మి 8ఐ- రూ 13,999
రూ 15,000లోపు లభించే స్మార్ట్ఫోన్లలో ఫాస్టెస్ట్ ఫోన్గా చెబుతున్న రియల్మి 8ఐ మీడియాటెక్ హిలియో జీ96 ప్రాసెసర్తో క్యాచీ డిజైన్తో ఆకట్టుకుంటోంది. 6.6 ఇంచ్ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో లెన్స్, మరో 2 మెగా పిక్సెల్ డెప్త్ లెన్స్తో పాటు ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కలిగిఉంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో రూపొందింది.
మైక్రోమ్యాక్స్ ఐఎన్ 1- రూ 10,499
మైక్రోమ్యాక్స్ ఐఎన్ 1 భారీ స్క్రీన్, క్వాడ్ లెన్స్ కెమెరా, పవర్ఫుల్ బ్యాటరీ వంటి ఎన్నో ఫీచర్లతో ఈ బడ్జెట్ ఫోన్ కస్టమర్లకు మెరుగైన అనుభాతి ఇస్తుంది. మీడియాటెక్ హిలియో జీ80 ప్రాసెసర్తో ఈ బడ్జెట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్పై రన్ అవుతుంది. 6.6 ఇంచ్ డిస్ప్లేను కలిగిఉంటుంది.