న్యూఢిల్లీ : ఫోల్డబుల్ ఫోన్ల గురించి హాట్ డిబేట్ సాగుతుండగా ఆసుస్ ఓ అడుగు ముందుకేసి న్యూ ఫోల్డింగ్ ల్యాప్టాప్ను లాంఛ్ చేసింది. ఆసుస్ జెన్బుక్ 17 ఫోల్డ్ ఓఎల్ఈడీని ఆవిష్కరించింది. ఆసుస్ స్టైలిష్ డిజైన్తో లాంఛ్ చేసిన న్యూ ల్యాప్టాప్ను 17 ఇంచ్ ట్యాబ్లెట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. తొలి తరం ఫోల్డబుల్ ల్యాప్టాప్గా ఆసుస్ జెన్బుక్ 17 ఫోల్డ్ ఓఎల్ఈడీ ఆకట్టుకుంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. డిజైన్ పరంగా ఆసుస్ ఫోల్డింగ్ ల్యాప్టాప్ పర్ఫెక్ట్ డివైజ్ అని చెబుతున్నారు.
జెన్బుక్ 17 ఫోల్డ్ ఓఎల్ఈడీ 17.3 ఇంచ్ భారీ డిస్ప్లేతో ఫోల్డ్ చేసినప్పుడు ల్యాప్టాప్ థిక్గా కనిపిస్తుంది. ఫోల్డింగ్ ల్యాప్టాప్ మరీ ఎక్కువ బరువు కూడా లేదు. బ్లూటూత్ కీబోర్డుతో సహా ల్యాప్టాప్ 1.8 కిలోల బరువుంది. అయితే ఇంతకుమించిన బరువు ఉంటే దీన్ని క్యారీ చేయడం కష్టమే. షాక్స్, ప్రతికూల వాతావరణం, వైబ్రేషన్, మాయిశ్చర్ నుంచి రక్షణ కల్పించేలా ఈ డివైజ్కు మిలటరీ గ్రేడ్ ఎంఐఎల్-ఎస్టీడీ 810హెచ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ ఉంది.
ఇక ల్యాప్టాప్ ఇతర కీలక ఫీచర్ల విషయానికి వస్తే క్వాడ్ స్పీకర్ సిస్టమ్, రెండు యూఎస్బీ-సీ థండర్బోల్ట్ 4 పోర్ట్స్, 3.5ఎంఎం ఆడియో జాక్, డెడికేటెడ్ పవర్, వ్యాల్యూం బటన్స్ ఆకట్టుకుంటాయి. 5 మెగాపిక్సెల్ వెబ్క్యామ్తో పటు ఇంటెల్ కోర్ ఐ7-125ఓయూ ప్రాసెసర్ను కలిగిఉంది. ఇక ఆసుస్ ఫోల్డబుల్ ల్యాప్టాప్ ధర మాత్రం అధికంగా ఉంది. ఈ ఫ్యూచర్ మెషీన్ రూ 3,29,990కి అందుబాటులో ఉంది.