I-Phone SE4 | ఆపిల్ ఐ-ఫోన్ కొనుక్కోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఆ ఫోన్లు సెలబ్రిటీలు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు, వ్యాపారవేత్తలు, బిజినెస్ మాగ్నెట్స్కు మాత్రమే అందుబాటు ధరలో ఉండేవి. ఇప్పటి వరకు ప్రీమియం సిరీస్, హై ఎండ్ ఫోన్లు మాత్రమే తయారు చేస్తూ వస్తున్న ఆపిల్.. మధ్య తరగతి, సాధారణ ప్రజలకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది.
గూగుల్ పిక్సెల్ 7ఏ ఫోన్కు పోటీగా ఉన్నతాదాయ వర్గాల వారితోపాటు సాధారణ ప్రజలను ఆకట్టుకునేందుకు సన్నద్ధం అవుతున్నది. తద్వారా స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో తన వాటా పెంచుకోవాలని ఉత్సుకత చూపుతున్నది. గతేడాది ఐ-ఫోన్ ఎస్ఈ 2022 (థర్డ్ జనరేషన్) ఫోన్ను మార్కెట్లో ఆవిష్కరించిన ఆపిల్.. వచ్చే ఏడాది అంటే 2024లో అందరికీ అందుబాటు ధరలో ఆల్టర్నేటివ్ ఫోన్ మార్కెట్లో ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నది. దానికి ఐ-ఫోన్ ఎస్ఈ 4 అని పేరు కూడా పెట్టినట్లు కనిపిస్తున్నది. ఆ ఫోన్లో వచ్చే ఫీచర్లు, అప్గ్రేడ్స్పై ఓ లుక్కేద్దామా..
ఐ-ఫోన్ ఎస్ఈ 3 మాదిరిగానే ఐ-ఫోన్ ఎస్ఈ4 కూడా 4.7-అంగుళాల కంపాక్ట్ డిస్ప్లే కంటే మెరుగ్గా 6.1-అంగుళాల డిస్ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. 2018లో ఆవిష్కరించిన ఐ-ఫోన్ ఎక్స్ఆర్ డిజైన్ను పోలి ఉంటుందని సమాచారం. అందరికీ అందుబాటు ధరలో అందించడానికి వీలుగా ఎస్ఈ4 ఫోన్లో ఏ16 బయోనిక్ చిప్సెట్తో రావచ్చు. ఇటువంటి చిప్నే ఐ-ఫోన్15లోనూ వాడుతున్నట్లు వినికిడి. ఐ-ఫోన్ ఎస్ఈ3 మాదిరిగానే ఎస్ఈ4 కూడా 5జీ కనెక్టివిటీ పొందుతుందని సమాచారం.
మరో టెక్ దిగ్గజం గూగుల్ తీసుకొచ్చిన పిక్సెల్ సిరీస్ ఫోన్ల తరహాలో ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ4 ఉండొచ్చు. ఈ ఫోన్ ప్రత్యేకించి గూగుల్ పిక్సెల్ 7ఏతో పోటీ పడుతుందని తెలుస్తున్నది. ఐ-ఫోన్ ఎస్ఈ3.. డిస్ప్లే స్క్రీన్ అన్ లాకింగ్కు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వాడవచ్చునని మాషబుల్ అనే సంస్థ వెల్లడించింది. గూగుల్ పిక్సెల్ 7ఏకు పోటీగా ఐ-ఫోన్ ఎస్ఈ4లో రెండు రేర్ కెమెరాలు అమర్చే అవకాశాలు ఉన్నాయి. కానీ, ఐ-ఫోన్ ఎస్ఈ3లో మాత్రం సింగిల్ కెమెరా మాడ్యూల్ మాత్రమే ఉండటం గమనార్హం.