న్యూఢిల్లీ : న్యూ ఐఫోన్ మోడల్స్పై కసరత్తు సాగిస్తోన్న యాపిల్ తాజాగా ఐఫోన్ ఎస్ఈ 4ను వచ్చే ఏడాది లాంఛ్ చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. గత ఏడాది లాంఛ్ అయిన ఐఫోన్ ఎస్ఈ థర్డ్ జనరేషన్కు కొనసాగింపుగా ఐఫోన్ ఎస్ఈ 4ను కస్టమర్ల ముందుకు తీసుకురానుంది.
వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్లో ఐఫోన్ ఎస్ఈ 4 అధికారిక లాంఛ్కు యాపిల్ సన్నద్ధమవుతోంది. ఇక లాంఛ్కు ముందు ఐఫోన్ ఎస్ఈ 4కు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో సందడి చేస్తున్నాయి. ఎస్ఈ సిరీస్లో ఇప్పటివరకూ రానంత భారీ డిస్ప్లేతో ఐఫోన్ ఎస్ఈ 4 ఎంట్రీ ఇస్తుందని డిస్ప్లే సప్లయి చైన్ కన్సల్టెంట్స్ (డీఎస్సీసీ)కు చెందిన రాస్ యంగ్ చెబుతున్నారు.
ఐఫోన్ ఎస్ఈ 4 6.1 ఇంచ్ లిక్విడ్ రెటీనా ఎల్ఈడీ డిస్ప్లేతో రానుందని యంగ్ అంచనా వేశారు. ఇది అందుబాటు ధరలో రానున్న ఐఫోన్ మోడల్గా చెబుతున్నారు. ఐఫోన్ ఎక్స్ను పోలిన డిజైన్తో ఐఫోన్ ఎస్ఈ 4 ఉంటుందని చెబుతున్నారు. కెమెరా సెటప్ కూడా భారీ మార్పులకు లోనవుతుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.