న్యూఢిల్లీ : భారత్ మార్కె్లో జీటీఆర్ మినీ పేరుతో అమేజ్ఫిట్ న్యూ స్మార్ట్వాచ్ను (Amazfit) లాంఛ్ చేసింది. రౌండ్ డయల్, స్లిమ్ ప్రొఫైల్తో 120ప్లస్ స్పోర్ట్స్ మోడ్స్, హార్ట్రేట్, ఎస్పీఓ2 వంటి అడ్వాన్స్డ్ హెల్త్ మానిటరింగ్ ఫీచర్లతో ఈ స్మార్ట్వాచ్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. స్టైల్, ఫంక్షనాలిటీని కోరుకునే వారికి ఇది అనువైన డివైజ్ అని కంపెనీ వెల్లడించింది.
అమెజాన్ ఇండియాలో ఎక్స్లూజివ్గా లభించే ఈ స్మార్ట్వాచ్ ప్రారంభ ధర రూ. 10,999. లేటెస్ట్ డివైజ్ మిడ్నైట్ బ్లాక్, పింక్, ఓషన్ బ్లూ కలర్స్లో లభిస్తుంది. అమేజ్ఫిట్ జీటీఆర్ మిని 1.28 ఇంచ్ హెచ్డీ అమోల్డ్ డిస్ప్లేతో బయోట్రాకర్పీపీజీ ఆప్టికల్ సెన్సర్ వంటి కీలక ట్రాకర్స్తో కస్టమర్ల ముందుకొచ్చింది. ఈ ట్రాకర్తో రియల్ టైమ్లో హార్ట్ రేట్, బ్లడ్-ఆక్సిజన్ శాచురేషన్, స్ట్రెస్ లెవెల్లను ట్రాక్ చేయవచ్చు.
24 గంటల హెల్త్ మానిటరింగ్ యాక్టివేట్ చేసుకుంటే హార్ట్ రేట్లో హెచ్చుతగ్గులు, అధిక స్ట్రెస్ లెవెల్స్ వంటి అసాధారణ రీడింగ్స్తో యూజర్లను అలర్ట్ చేస్తుంది. అవసరమైతే ఒత్తిడి తగ్గించుకునేందుకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయాలని రికమెండ్ చేస్తుంది. అమేజ్ఫిట్ అద్భుతమైన బ్యాటరీ లైఫ్తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఒకసారి బ్యాటరీ చార్జింగ్ చేస్తే ఈ స్మార్ట్వాచ్ 14 రోజుల పాటు పనిచేస్తుంది.
Read More :